పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కున్న భవత్పురోధర నసూత్కరముం ద్యజియించుదాన స
ర్వోన్నతసత్తపోవిభవ మొంద సుఖించు చిరాయురున్నతిన్.

295


క.

అనుచు విలపించు మాయా, జననిం గని యక్కుమారచంద్రుఁడు వినియున్
విననిగతి నుండె హరిపద, వనజభ్రమరన్మనఃప్రవర్తనుఁ డగుచున్.

296


గీ.

వత్స! వత్స! మహోగ్రరావములు బెఱయ, రయసముద్యత తీవ్రశస్త్రప్రచండ
భండనోద్దండులగు దైత్యపతులు వీర, వచ్చి రెచ్చట చొరవఁగా వచ్చు నీకు.

297


వ.

అని యదృశ్యం బయ్యె నప్పుడు.

298


క.

పొడు పొడు మని కూకలు బ, ల్విడి చంపుఁడు చంపుఁ డనెడు వికృతోక్తులు మ్రిం
గుఁడు మ్రింగుఁ డనెడునార్పులు, దడబడఁగాఁ జుట్టుముట్టె దైత్యబలంబుల్.

299


చ.

అదరులు చల్లుకైదువు లుదగ్రతఁ ద్రిప్పుచు ఘోరవాక్యముల్
వదరుచు మండలభ్రమణవైఖరిఁ బాఱుచు నొక్కరొక్కరిన్
బదరుచు హుంక్రియాకలనఁ బల్మఱు నిక్కుచు వెక్కిరించుచున్
బొదుపయి బెట్టుకూసిరి నభోవలయం బద్రువ న్నిశాచరుల్.

300


గీ.

దీర్ఘదంష్ట్రలవదనము ల్దెఱిచి మెడలు, సాచి పెనుమంట లురుల నుచ్చైస్స్వరముల
మిగులవాపోయె నక్కలు మేదినీశ, తనయుముందర చెవులు చిందరులు వోవ.

301


వ.

మఱియు నద్దానవులు సింహోష్ట్రమకరాననులై నానావిధఘోరారావంబులు
చేయుచు నారాజపుత్రుని వెఱపించ నతండు గోవిందాసక్తచిత్తుం డగుటం జేసి
తన్మాయావిలసనంబు లేమియు నింద్రియగోచరంబులు గావయ్యె; నంతకంతకు
నేకాగ్రచిత్తుండై చిత్తజజనకుం దలంచుచునున్న యన్నరేంద్రునందనుం జూచి
సంక్షోభంబు నొంది బృందారకులు సర్వశరణ్యుండగు నిందిరారమణుపాలికిం
జని యిట్లని విన్నవించిరి.

302


గీ.

దేవదేవ, జగన్నాథ, శ్రీవధూసనాథ, పురుషోత్తమ, పరేశ, నవ్యమహిమ
వెలయు నౌత్తానపాది గావించుతపము క్రాచె, మము నెల్లఁ గరుణచేఁ గావవయ్య.

303


క.

నెలబాలుఁడు దినదినమున, కళల పసల వృద్ధి నొందు గతి నుగ్రతపో
విలసనమున దినదినమున, కలఘుం డతఁ డధికవృద్ధి నందుచునుండున్.

304


క.

బలరిపువరుణధనేశ్వర, జలజహితశశాంకు లేలుస్థానము లేలం
దలఁచియొ యొనర్చె నృపసుతుఁ, డలఘుతపము దీని మాన్పవయ్య ముకుందా.

305


చ.

అన విని పద్మనాభుఁ డను నమ్మహితాత్ముఁడు మీనివాసముల్
వివఁగన నొల్లఁ డొక్కటి నవీనమనోరథ మాత్మఁ గోరు నే