మఱియ సాధకంబైన సర్గాంతరంబు తలంచుచుండ, నతనికిఁ దిర్యక్సర్గం
బభివర్తింప నందువల్లఁ దిర్యక్సర్గంబు పశ్వాదులు తమఃప్రాయంబులు,
నవేదులు, నుత్పథగ్రాహులు నజ్ఞానులు, జ్ఞానమానులును,అహ
మానులును, అంతఃప్రకాశంబులు, పరస్పరావృతంబులు నష్టావింశ
ద్విధాత్మకంబులునై పుట్టెను. ఆతిర్యక్సర్గం బన్యసాధకంబుగాఁ దలంచి
సర్గాంతరంబు తలంచునజునకు నూర్థ్వశ్రోతంబు ప్రవర్తించిన నందువలన
సాత్త్వికంబైన దేవవర్గంబు పుట్టె. వారు సుఖప్రీతిబహుళులును, బహిరంతరం
బుల ప్రకాశులును, అనావృతులును, తుష్టాత్ములునునై వెలుంగుదురు. ఆ దేవ
సర్గంబు చూచి పరమప్రీతిసంపన్నుండై పుండరీకాసనుండు వెండియు సర్గాం
తరంబు చింతించుచుండ, నర్వాక్శ్రోతంబు ప్రవర్తింప నందువల్ల తమోరజో
ధికంబును, దుఃఖబహుళంబును పునఃపునఃకారియు, బహిరంతఃప్రకాశం
బునునైన మనుష్యసర్గంబు పుట్టె. బ్రహ్మకు ప్రథమంబు మహత్సర్గంబు. ద్వితీ
యంబు తన్మాత్రభూతసర్గంబు. తృతీయంబు వైకారికంబును, నైంద్రియకం
బును. చతుర్థంబు ముఖ్యసర్లంబు. పంచమంబు తిర్యక్సర్గంబు. షష్ఠంబు దేవ
సర్గంబు. సప్తమంబు మానుషసర్గంబు. అష్టమం బనుగ్రహసర్గంబు. నవమంబు
కౌమారసర్గంబు. ఈతొమ్మిదిసర్గంబులును జగన్మూలహేతువు లగునని సంక్షేప
ప్రకారంబునఁ జెప్పి సవిస్తరంబుగా వినందలంచిన మైత్రేయునకు శ్రీపరాశరుం
డిట్లనియె.