పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అందుఁ బితరులు జనియింప నబ్జభవుఁడు, విడిచెఁ దత్తను వదియును వెలసె సంధ్య
యనఁగ ద్విజకోటిచే సేవ్యయగుచు నెపుడు, బ్రహ్మయును నంత దేహాంతరంబుఁ దాల్చె.

128


క.

వినుము రజోధిక మగున, త్తనువువలన మనుజకోటి తద్దయుఁ బొడమెన్
వనజజుఁడు విడువ దఁనువది, వినుతజ్యోత్స్నాభిధాన విశ్రుతిఁ గాంచెన్.

129


వ.

జ్యోత్స్నారాత్ర్యహస్సంధ్యలు నాలుగును బ్రహ్మశరీరంబులుగా నెఱుం
గుము. మఱియు రజోమాత్రాత్మికయగు తనువు ధరించియున్న యన్నలినాస
నునకు క్షుతంబు వొడమె, నందువలన నంధకారంబునందు క్షుత్క్షాములు విరూ
పులు శ్శశ్రుముఖులు నైనవారు పుట్టి ధాతం జుట్టుముట్టి మాం రక్ష రక్ష
యని పలుకుటం జేసి రాక్షసు లనం బరగిరి. కొందఱు భక్షింతమను జక్షణంబు
వలన యక్షులనఁ బుట్టిరి. వారి నప్రియంబులం జూచుదాత కేశంబులు విశీర్ణం
లై తల కెక్కి విసర్పించు కతంబున సర్పంబులు పుట్టి హీనంబు లగుట నహు లనం
బరఁగె. అంత క్రోధావిష్టుండై, జగత్స్రష్ట కపిలవర్ణంబులును నుగ్రంబులును
బిశితాశనంబులగు భూతగణంబుల నిర్మించె నంగంబువలన గంధర్వులను,
వయస్సువలనఁ బక్షులను, వక్షంబువలన మేషంబుల, ముఖంబువలన నజంబుల,
నుదరంబులవలననుఁ బార్శ్వంబులవలనను గోవులను, బాదంబులవలన
నశ్వమాతంగరాసభగవయమృగంబులను, నుష్ట్రాశ్వతరన్యంకువులను, రోమం
బులవలన ఫలమూలినులగు నోషధులం గల్పించె, నిట్ల కల్పాదిత్రేతాయుగ
ముఖంబున నిర్మించి.

130


గీ.

గోవు నజమును పురుషుండు గొఱియ గుఱ్ఱ, మశ్వతరగర్దభంబులు ననఁగ నేడు
గ్రామ్యపశువుల నధ్వరకార్యమునకు, ఛాత నియమించె కుశలసంధాత యగుచు.

131


ఉ.

ఓపరమర్షివర్య! కమలోద్భవుఁ డధ్వరకార్యభారసు
శ్రీపరిమాణామ మొప్ప విభజించె నరణ్యపశువ్రజంబు గాం
క్షాపరలీల నెన్నికకు సప్తవిధంబుల భూతధాత్రి వై
శ్వాపదవానరద్విఖురసామజపక్షిజలేచరాహులన్.

132


సీ.

రుఙ్నివహంబు త్రివృద్ధధంతరము ల, గ్నిష్టోమగాయత్రినియమవిధులు
యజురాగమంబు స్తోమాధ్వరత్రైష్టుభం, బులు బృహత్సామోక్థ్యములతెఱంగు
సామంబు జాగతఛ్ఛందంబు సోమంబు, వైరూప మతిరాత్రవర్తనంబు
సమధికాధర్వ మార్యమణమానుష్టుభ, చ్ఛందంబు వై రాజసారసరణి


గీ.

ఘనుఁడు రాజీవభవుఁ డనుక్రమనిరూఢి, యొనర ప్రాక్దక్షిణప్రతీచోత్తరాస్య
నీరజంబులవలనఁ బూనిక సృజించె, సాంద్రవిభవంబు మీఱ మునీంద్రచంద్ర.

133