పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ధరణిపై ఘోరసంగరస్థలములందు మడియురాజులఁ జూచి యిప్పుడమి నవ్వు
నహహ తమసొమ్మనానే ననర్థమైన, మమత నూరక మూఢులై సమసి రంచు.

476


ఉ.

ఎంతని యెంచవచ్చు ధరణీశులమోహమహాతమంబు వి
భ్రాంతి నమాత్యభృత్యులను బౌరులఁ గెల్చి యనంతరంబ వి
క్రాంతి నరాతులం గెలిచి గహ్వరియంతయు నాక్రమించి ని
శ్చింతత నేలువారమని శీఘ్రము చెందుదు రుగ్రమృత్యువున్.

477


వ.

సాగరసంవృతంబైన భూమండలం బాక్రమించినను జిత్తశాంతి కల్గునే, చిత్త
శాంతి గల్గి యాత్మజయంబు చేసి ముక్తిఫలంబు చెందవలయు.

478


గీ.

తాతతండ్రు లొకింతయుఁ ద్రవ్వి నన్నుఁ గొంచుఁబోవుట లేదుగాఁ గుటిలు లగుచుఁ
దనయు లేటికి మన్మమతాలతాని, బద్ధులై కూలెదరు ఘోరయుద్ధభూమి.

479


క.

ఎన్నక తండ్రులఁ దమ్ముల, నన్నలనైన న్వధింతు రక్కట నాకై
ము న్నేనరపతులైనను, నన్ను సతము చేసి నిలిచినారా యెందున్.

480


గీ.

మమత నఖిలోర్వి యేలిన మనుజపతులు, పోవఁజూచియు నిలిచిన భూమిపతులు
నిది మదీయమహీస్థలి యేమ యనుభ, వింతుమని నాశ మొందెంద రెంతవింత.

481


ఉ.

నామహి నీకు నేలనగునా, యిదె వేగ నతిక్రమించి నా
నామదమోఘసాయకగణంబుల మున్ను వధించి కొందు నా
భూమియటంచు దూతలఁ బ్రభుత్వమునం బరరాజుపాలి కు
ద్దామతనంపువారిఁ గని తాల్తు దయారసమందహాసముల్.

482


వ.

అని యిట్లు తొల్లి యంసకుండనుముని జనకునకుం జెప్పిన పృథివీగీతార్థంబు
చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

483


క.

ధరణిగీతార్థము విను, పురుషులహృదయముల మమత పొలియు నుదయభూ
ధరశిఖరారూఢాహ, స్కరుఁ గని హిమచయము పొలియుకైవడి మఱియున్.

484


వ.

ఇమ్మనువంశంబు నీకుఁ జెప్పితి. ఇందు భగవదంశభూతులైన రాజులు పుట్టిరి.
వీరిచరితంబు విన్న నశేషపాపక్షయంబును బుత్రపౌత్రధనధాన్యాయు
రారోగ్యంబులును నభివృద్ధియునగు. సూర్యసోమాన్వయసంభవులగు నిక్ష్వాకు,
జహ్ను, మాంధాతృ, సగరావిక్షితరఘువులను, యయాతినహుషాదులను,
విన్నఁ బురుషునకు మమత్వాదిదోషంబులు పొరయకుండు.

485


గీ.

క్రతువు లొనరించి దానధర్మములు చేసి, ఘోరరణముల వైరులఁ గూల్చి సర్వ
వసుమతియు నేలి మేదినీవరులు పొలిసి, పోయిరే కాక నిలిచిరే భూమిమీఁద.

486