పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మాత్రంబే ప్రసాధనహేతువుగా, స్వీకరణమాత్రంబే వివాహహేతువుగా,
నద్వేషధారణమాత్రంబే పాత్రంబుగా, దూరానయనోదకమాత్రంబే
తీర్థంబుగా ని ట్లనేకదోషంబులు గలిగి కలివేళ భూమండలంబున సర్వవర్ణం
బులు క్షీణంబులు కాఁగలవు. వినుము.

458


క.

ఏజాతియైనఁగానీ, భూజనములలోన బలిమి పొదలినవాఁడే
రా జగు కలియుగవేళ ధ, రాజనముల నొడిచికొని కరము గైకొనుచున్.

459


వ.

ఇవ్విధంబున.

460


ఉ.

లోలవిహారశీలు లతిలోభులు క్రూరులునై ననీచభూ
పాలకు లేచఁ బీడవడి పాడియుఁ బంటయు లేక భూప్రజల్
శైలవనప్రదేశముల చక్కి వసింతురుగాక కందముల్
మూలఫలంబు లున్మధువులు న్దళపుష్పములున్ భుజించుచున్.

461


క.

తరువల్కపర్ణచీరా, వరణు లగుచు శీతవాతవర్షాతపదు
ర్భరపీడ కోర్చి గాఢా, తురత నశరణత్వ మందుదురు ప్రజలెల్లన్.

462


గీ.

ఏడనైనను నిరువదిమూఁడువత్స, రములు బ్రతుకఁడు నరుఁడు ధరాస్థలమునఁ
గలియుగవసానమున ని ట్లఖిలజగంబు, లనుదినంబును నాశంబు నందఁగలవు.

463


వ.

శ్రౌతస్మార్తధర్మంబులు విప్లవంబు నొందిన నచరాచరంబైన జగంబు క్షీణ
ప్రాయంబైన కలియుగంబు నంతంబున.

464


సీ.

అఖిలజగత్స్రష్టయై చరాచరగురుండై సర్వమయుఁడయి యప్రమేయుఁ
డై బ్రహ్మమై సముద్యచ్ఛక్తిచే నొప్పు వాసుదేవుని యనిర్వాచ్యమైన
యంశంబు శంబరాఖ్యగ్రామముఖ్యుఁడౌ విష్ణుయశుండను విప్రునకును
కల్కినా జనియించి కలుషాస్పదీభూతకలివసానోద్భూతకలితపాత


గీ.

కాఖిలమ్లేచ్ఛతతుల దీవ్యత్కరాగ్ర, జాగ్రదుగ్రలసన్మండలాగ్రఘోర
ధారఁ జక్కాడి ధారుణీస్థలమునందుఁ, బొందుగా నిల్పుఁ గృతధర్మములు మునీంద్ర.

465


వ.

అనంతరం బశేషకల్యవసాననిశావసానంబున జనపదంబులయండు శేషించిన
జలకు విమలబుద్ధి జనించు, కృతయుగంబునకు బీజభూతులగు నశేష
మనుష్యులకుఁ దత్కాలంబున నపత్యంబులు పుట్టి కృతయుగధర్మానుసారులై
వృద్ధిఁ బొందుదురు. వినుము.

466


గీ.

అబ్జుఁ డర్కుండు తిష్యంబు నమరగురుఁడు, నేకరాశిస్థు లయ్యెద రెన్నఁడేని
నాఁడె కృతము ప్రవేశించు నవ్యధర్మ, జననకారణనిజసముచ్ఛ్రయము వెలయ.

467


వ.

అతీతవర్తమానానాగతభూపాలుర నీ కెఱింగించిని. పరీక్షిత్తుజన్మంబు మొదలు
కొని నందాభిషేకపర్యంతంబు వేయునేఁబదివత్సరంబులు సప్తఋషుల