గలరు. అనంతరంబ యెనమండ్రు యవనులు, పదునలుగురు తురుష్కారులు
పదుముగ్గురు ముండులు పదునొకండ్రు మౌనులు నను వీరిందఱు వెయ్యి
మున్నూటతొంబదేండ్లు భూమి యనుభవించెదరు. వీరు పోయిన కైంకిలు
లైన యవనులు నమూర్థాభిషిక్తులు భూపతులు కాఁగలరు. వారలకు
వింధ్యశక్తి వింధ్యశక్తికిఁ బురంజయుండు వానికి రామచంద్రుండు నత
నికి ధర్ముండు నతనికి వంగుండు నతనికి నందనుండు నతనికి సునంది పుట్టెదరు.
అతనిభ్రాత యగునంది యశుండు శుక్రుండు ప్రవీరుండును వీరుండును నూట
యాఱువర్షంబులు భూమి యనుభవించెదరు. వారిపుత్రులు పదుమువ్వురు
బాహ్లికులు మువ్వురు తదనంతరంబ పుష్యమిత్రపటుమిత్రులు పదుమువ్వురు
నాంధ్రు లేడ్వురును కోసలయందుఁ దొమ్మండ్రును భూపతులు కాఁగలరు. వారె
నైషధులు. మాగధయందు విశ్వస్ఫటికసంజ్ఞుం డన్యవర్ణంబులఁ గల్పింపఁ
గలఁడు. అఖిలక్షత్త్రకులంబు నణించి మగధులు గంగాప్రయాగసమీపం
బునఁ బద్మావతీపురంబున నుండి భూమి ననుభవింపఁగలరు. కోసలాంధ్ర
పుండ్రతామ్రలిప్తసమతటపురములను దేవరక్షిత యనువాఁడు రక్షింపఁ
గలండు. కళింగమాహిషమహేంద్రజనపదంబులను భౌమపురంబును
గుహు లనుభవించెదరు. నైషధనైమిషకకాలకోశకజనపదంబులను మణి
ధాన్యకవంశబు లనుభవింపఁగలరు. త్రైరాజ్యముషికజనపదంబులను కన
కాహ్వయుఁడు భుజించును. సౌరాష్ట్రావంత్యశూద్రాభీరదేశములను నర్మదా
మరుభూమివిషయములను వ్రాత్యద్విజాభీరశూద్రాదు లనుభవించెదరు.
సింధుతటదావికోర్వీచంద్రభాగాకాశ్మీరవిషయంబులను వ్రాత్యమ్లేచ్ఛ
శూద్రాదు లనుభవించెదరు. వీరు కలియుగమున సకాలికులగు రాజులు కాఁ
గలరు. వినుము.