అన్న పతితుండైనఁ దమ్మునికిఁ బరివేతృత్వంబు లేదు, రమ్మని పిలిచిన శంతనుండు
పురంబునకు వచ్చి రాజ్యంబు చేసె. దేవాపి పతితుండైనఁ బర్జన్యుండు వర్షించె.
అఖిలధరామండలంబున సస్యసంపదలు వొదివె. బాహ్లికునకు సోమదత్తుండు
సోమదత్తునకు భూరిభూరిశ్రవశ్శల్యసంజ్ఞలుగల పుత్రత్రయంబు గలిగె.
శంతనునకు జాహ్నవియందు నుదారకీర్తియు నశేషశాస్త్రార్థవేదియు నైన
భీష్ముండు గలిగె. ఆశంతనునకే సత్యవతియందు చిత్రాంగదవిచిత్రవీర్యులను
నిద్దఱుపుత్రులు గలిగిరి. అందుఁ జిత్రాంగదుండు బాలత్వంబునన చిత్రాంగ
దుండను గంధర్వునితోఁ బోరి తెగిన విచిత్రవీర్యుఁడు రాజై కాశిరాజదుహి
తల నంబికాంబాలికలం బెండ్లి యాడి నిరంతరతదుపభోగంబున రాజయక్ష్మ
గృహీతుండై యస్తమించిన సత్యవతీదేవి తత్పుత్రుండైన కృష్ణద్వైపాయను
నియోగించిన మాతృవచనంబు పాటించి విచిత్రవీర్యక్షేత్రంబుల ధృతరాష్ట్ర
పాండులను, దత్పరిచారికయందు విదురునిం గనియె. ధృతరాష్ట్రుండును దుర్యో
ధనదుశ్శాసనప్రధానంబైన పుత్రశతంబుం గనియె. పాండుండును నరణ్యం
బున మృగశాపోపహతప్రజననసామర్థ్యుండై, ధర్మవాయుశక్రులవలనఁ
గుంతియందు యుధిష్ఠిరభీమసేనార్జునులం గనియె. అశ్వినులవలన మాద్రి
యందు నకులసహదేవులం గనియె. ఇట్లు పాండవు లేవు రైరి. వారలకు ద్రౌపది
యందు గ్రమంబునఁ బ్రతివింధ్య, శ్రుతసేన, శ్రుతకీర్తి, శతానీక, శ్రుత
కర్ములనం గలిగిరి. మఱియును యుధిష్ఠిరుండు యౌధేయియను కాంతయందు
దేవకుండను పుత్రుం గనియె. భీమసేనుండు హిడింబయందు ఘటోత్కచుం
గనియె. మఱియు భీమసేనుండు కాశియను కాంతవలన సర్వగుండను
పుత్రునిం బడసె. సహదేవుండు విజయయందు సుహోత్రునిం గనియె. నకు