ఇప్పుడు భూమండలం బేలు పరిక్షిత్తునకు జనమేజయశ్రుతసేనోగ్రసేనభీమ
సేను లన నలువురు పుత్రులు పుట్టెదరు. అందు జనమేజయునకు శతానీకుండు
పుట్టును. ఆ జనమేజయుండు యాజ్ఞవల్క్యునివద్ద వేదంబు చదివి కృపుని
వలన దివ్యాస్త్రంబులు పడసి విషయవిరక్తచిత్తుండై శౌనకోపదేశంబున
నాత్మవిజ్ఞానప్రవీణుండై పరమనిర్వాణంబు నొందఁగలండు. శతానీకునకు
నశ్వమేధదత్తుండు నతనికి నధిసీమకృష్ణుండు నతనికి నిచక్నుండు పుట్టును.
అతఁడు హస్తిపురము గంగాపహృతము కాఁగాఁ గౌశాంబియందు నివసింపఁ
గలడు. అతనికి నుష్ణుండ నతనికి విత్రరథుండు నాతనికి శుచిరథుండు
నతనికి వృష్ణిమంతుండు నతనికి సుషేణుండు నతనికి సునీధుండు నతనికి నృపచ
క్షుండు నతనికి సుఖబలుండు నతనికిఁ బరిప్లపుండు నతనికి సునయుండు నతనికి
మేధావియు నతనికి రిపుంజయుండు నతనికి నుర్వుండు నతనికిఁ దిగ్ముండు నత
నికి బృహద్రథుండు నతనికి వసుదానుండు నతనికి శతానీకుండు నతని కుదయ
నుండు నతనికి విహీనరుండు నతనికి దండపాణి యతనికి నిమిత్తుండు నతనికి
క్షేమకుండును గలుగంగలరు. ఇట్లు బ్రహ్మక్షత్రకారణంబును, దేవర్షి
సత్కృతంబును నైన సోమవంశంబు క్షేమకునినుండి నాశంబు నొందంగల
దని చెప్పి శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.