వయఃపరిణత యయ్యును, నల్పదినంబులలోన శైబ్య గర్భంబు దాలిచి కుమా
రునిం గనియె. అతనికి జ్యామఖుండు విదర్భనామం బిడియె. అతండు సంప్రాప్త
యౌవనండై స్నుషయగు నారాజకన్యం బరిణయం బయ్యె. వారి కిద్దఱికి గ్రధ,
కైశిక, రోమపాదులను మువ్వురుపుత్రులు పుట్టిరి. అందు రోమపాదునకు
బభ్రుండు, బభ్రునకు ధృతి పుట్టె. కైశికునకుఁ జేది చేదిసంతతియందుఁ జైద్యు
లను రాజులు పుట్టిరి. అందు గ్రధుండను స్నుషాపుత్రునకుఁ గుంతి, కుంతికి
ధృష్టి, ధృష్టికి నిధృతి, నిధృతికి దశార్హుండు, దశార్హునకు వ్యోముండు,
వ్యోమునకు జీమూతుండు, జీమూతునకు వికృతి, వికృతికి భీమరథుండు, భీమ
రథునకు నవరథుఁడు, నతనికి దశరథుఁడు, నతనికి శకుని, శకునికిఁ గరంభి, కరంభికి
దేవరాతుండు, దేవరాతునకు దేవక్షత్రుండు, దేవక్షత్రునకు మధుండు, మధు
నకుఁ గుమారవంతుండు, కుమారవంతునకు ననుండు, ననునకుఁ బురుమిత్రుండు,
పురుమిత్రునకు నంశుండు, నంశునకు సత్వతుండు, సత్వతునకు సాత్వతులు
గలిగిరి. ఇది జ్యామఖునిసంతతి. దీని సమ్యక్ఛ్రద్ధావంతులై వినినఁ బాపం
బులం బాయుదురని చెప్పి శ్రీపరాశరుఁడు మైత్రేయున కిట్లనియె.