పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

కావున నీతృష్ణం బరిత్యజించి వాసుదేవబ్రహ్మంబునందు మానసంబు చేర్చి
ద్వంద్వంబులు గెలిచి మమకారంబు విడిచి వనంబున మృగంబులం గూడి
చరించెదనని తలంచి పూరునకు యావనం బిచ్చి తనజర మగుడంబుచ్చుకొని
దక్షిణపూర్వదిశయందు దుర్వసుని, బ్రతీచియందు ద్రుహ్యుని, దక్షిణ
దిశయందు యదువును, నుదీచియందు ననువును మండలాధిపత్యంబునకుఁ
బూరు నభిషిక్తుం జేసి వనంబునకుం జనియె నని చెప్పి శ్రీపరాశరుండు మైత్రే
యున కిట్లనియె.

304


చ.

అనుపముఁ డాయయాతిసుతుఁడైన యదుండు తదన్వయంబు పా
వనము తదీయకీర్తన మవారితభూరితరాఘకోటినా
శనము శుభప్రదంబు సురసన్నుతిపాత్రము నీకుఁ జెప్పెదన్
వినుము మునీంద్రచంద్ర శ్రుతివీథుల పండువు చేయుచుండఁగన్.

305


చ.

కలగొనఁ బద్మజాండమునఁ గల్గు సురాసురమర్త్యపన్నగా
దులు తప మాచరించి పరితోషమునం బురుషార్ధవర్గ మే
యలఘుతరానుభావుకృప నందుదు రట్టి పరాత్పరుండు శ్రీ
నిలయుఁడు విష్ణుఁ డంబురుహనేత్రుఁడు పుట్టెఁ దదన్వయంబునన్.

306


వ.

అట్టి యదువునకు సహస్రజిత్, క్రోష్టు, నల, నహుష సంజ్ఞలుగల నలు
గురుపుత్రులు గలిగి రందు సహస్రజిత్తునకు శతజిత్తు, శత్రజిత్తునకు హైహ
య, హేహయ, వేణుభయులను ముగ్గురుపుత్రులు పుట్టి రందు హైహయునకు
ధర్ముండు, ధర్మునికి ధర్మనేత్రుండు, ధర్మనేత్రునకుఁ గుంతి, కుంతికి సహజిత్తు,
సహజిత్తునకు మహిష్మంతుండు, మహిష్మంతునకు భద్రశ్రేణ్యుండు, నతనికి
దుర్దముండు, నతనికి ధనకుండు, ధనకునకుఁ గృతవీర్య, కృతాగ్ని, కృతధర్మ,
కృతౌజనులన నల్వురుపుత్రులు జనించి రందుఁ గృతవీర్యునకు.

307


ఉ.

బాహుసహస్రసంభృతివిభాసి మహాసివినిర్దళద్రిపు
వ్యూహుఁడు సప్తసాగరపయోవృతివిస్ఫూరితాంతరీపసం
దోహనిఖాతయూపుఁడు మనోహరసత్యవచోవిశేషణో
త్సాహుఁడు పుట్టె నర్జునుఁ డుదగ్రయశోమహిమాభిరాముఁడై.

308


వ.

అక్కార్తవీర్యార్జునుండు సప్తద్వీపాధిపతియై భగవదంశభూతుండును నత్రి
పుత్రుండునునగు దత్తుని నారాధించి యమ్మహాత్మునివలన బాహుసహ
స్రం బధర్మసేవానివారణంబుగా ధర్మంబునఁ బృథివి జయించునట్లుగా
ధర్మంబునఁ బృథివి పాలించునట్లుగా నపరాజయంబుగా నఖిలజగత్ప్రఖ్యాత
పౌరుషంబు కలుగునట్లుగా మృత్యువు లేకుండునట్లుగా వరంబు వడసి యట్ల