అనిన బృహస్పతి యిట్లనియె, ఇత్తెఱంగు మున్నును నెఱింగించితివి. అందులకు
బ్రతికార్యంబు విచారించుచున్నవాఁడ, నెట్లైనను నీకు రాజ్యంబు కలుగు
నుపాయంబు చూచెద, అని పలికి రజిపుత్రుల బుద్ధిభ్రంశంబునకును నింద్రుని
తేజోభివృద్ధికొఱకును నొక్కయిష్టి కల్పించి వేల్చె. అందుకతంబున రజిపుత్రులు
బుద్ధి చలించి వేదోక్తకర్మత్యాగులై బ్రహ్మద్వేషులై ధర్మపరాఙ్ముఖులై రంత
యపేతధర్మాచారులైన వారి నింద్రుండు నిర్జించి పురోహితాప్యాయితతేజుండై
త్రిదివం బాక్రమించి ఎవ్వరేనియు నీయింద్రుని స్వపదచ్యవనారోపణం
బులు విందురు స్వపదభ్రంశంబు గాదు, దౌరాత్మ్యంబు తొలంగు. రంభుం డ
నపత్యుం డయ్యె. క్షత్త్రవృద్ధునికిఁ బ్రతిక్షత్త్రుం డతనికి సంజయుం డతనికి
జయుం డతనికి విజయుం డతనికిఁ గృతుం డతనికి హర్యశ్వుం డతనికి సహదేవుం
డతనికి నదీనుం డతనికి జయత్సేనుం డతనికి సంకృతి యతనికి క్షత్త్రధర్ముండు
పుట్టె. వీరలు క్షత్త్రవృద్ధునివంశంబువార లింక నహుషునివంశంబు చెప్పెద.
నహుషునకు యతి, యయాతి, సంయా, త్యాయాతి, వియాతి,కృతిసంజ్ఞు లార్గురు
పుత్త్రులు కలిగి రందు యతి రాజ్యం బొల్లఁ డయ్యె, వినుము.