పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

నారదుఁ డొక్కనాఁడు నరనాథతనూభవు లున్నచోటికిన్
గౌరవ మొప్పఁ బోయి బలఘాతి భవత్పితృపుత్రకుండు త
ద్భూరివిభూతికీరును బ్రభుల్ చని కైకొనుఁ డంచుఁ దెల్పినన్
వారు నతిత్వరం జని దివస్పతిఁ గని పల్కి రల్కతోన్.

290


ఉ.

నీవును నేము నారజికి నెయ్యపుఁబుత్త్రుల మౌట మాకు సం
భావన స్వర్గరాజ్యపరిపాలన మర్హ మటన్న నీక వాం
ఛావృతి నున్న యింద్రుని విశంకటవృత్తి జయించి స్వఃపురీ
భావుకరాజ్యమంతయు నభంగురులై వడి నాక్రమించినన్.

291


వ.

ఇంద్రుండు పరాజితుండై తొలంగిపోయె. బహుకాలంబు చనిన నొక్కనా
డేకాంతంబున బృహస్పతిం జూచి యల్లన దివస్పతి యిట్లనియె.

292


గీ.

క్రతువు చొరనీయ రేలాగ బ్రతుకవచ్చు. దాఁచ నేటికి మొకమెల్ల వాఁచె నిట్టి
కడిఁది యెఱుఁగఁ బురోడాశఖండ మొక్కరేగుపండంతయైన వారింప కిడరు.

293


వ.

అనిన బృహస్పతి యిట్లనియె, ఇత్తెఱంగు మున్నును నెఱింగించితివి. అందులకు
బ్రతికార్యంబు విచారించుచున్నవాఁడ, నెట్లైనను నీకు రాజ్యంబు కలుగు
నుపాయంబు చూచెద, అని పలికి రజిపుత్రుల బుద్ధిభ్రంశంబునకును నింద్రుని
తేజోభివృద్ధికొఱకును నొక్కయిష్టి కల్పించి వేల్చె. అందుకతంబున రజిపుత్రులు
బుద్ధి చలించి వేదోక్తకర్మత్యాగులై బ్రహ్మద్వేషులై ధర్మపరాఙ్ముఖులై రంత
యపేతధర్మాచారులైన వారి నింద్రుండు నిర్జించి పురోహితాప్యాయితతేజుండై
త్రిదివం బాక్రమించి ఎవ్వరేనియు నీయింద్రుని స్వపదచ్యవనారోపణం
బులు విందురు స్వపదభ్రంశంబు గాదు, దౌరాత్మ్యంబు తొలంగు. రంభుం డ
నపత్యుం డయ్యె. క్షత్త్రవృద్ధునికిఁ బ్రతిక్షత్త్రుం డతనికి సంజయుం డతనికి
జయుం డతనికి విజయుం డతనికిఁ గృతుం డతనికి హర్యశ్వుం డతనికి సహదేవుం
డతనికి నదీనుం డతనికి జయత్సేనుం డతనికి సంకృతి యతనికి క్షత్త్రధర్ముండు
పుట్టె. వీరలు క్షత్త్రవృద్ధునివంశంబువార లింక నహుషునివంశంబు చెప్పెద.
నహుషునకు యతి, యయాతి, సంయా, త్యాయాతి, వియాతి,కృతిసంజ్ఞు లార్గురు
పుత్త్రులు కలిగి రందు యతి రాజ్యం బొల్లఁ డయ్యె, వినుము.

294


సీ.

అతులతేజుండు యయాతి రాజై కావ్యు, నితనూజ దేవయానియును దనుజ
పతి వృషపర్వునిపట్టి శర్మిష్ణయు, భార్యలు గాఁగ భూభాగ మేలె
యదుఁడు దుర్వసుఁడును నన దేవయాని యి, ద్దఱునందనులఁ గాంచె దైత్యపుత్రి
ద్రుహ్యుఁడు ననుఁడు పూరుఁడు నన మువ్వుర, సుందరాకారుల సుతులఁ గాంచె