పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ్ఛదసంభాషణానుప్రశ్నంబులచేతఁ గలిసి వర్తించిన యతండు తత్తుల్య
పాతకుం డగును.

318


క.

దేవతలఁ బితరులను భూ, తావళి నతిథివ్రజంబు నర్చింపక వాం
ఛావృత్తిం దాఁ దిను, పా, పావహునకుఁ గలదె నిష్క్రియాకలన మహిన్.

319


వ.

నాలుగువర్ణంబులవారును స్వధర్మవిముఖులై హీనధర్మంబుల నడిచిన నగ్ను
లగుదురు. ఈనగ్నుల సర్వకాలంబుల దర్శనస్పర్శనాదులను వర్జింపవలయు.
శ్రద్ధావంతు లాచరించు శాద్ధంబు నగ్నులచేతం జూడఁబడిన నిష్ఫలంబగు
నీయర్ధంబున కొక్కయితిహాసంబు గలదు. ఆకర్ణింపుము.

320


సీ.

సకలధర్మజ్ఞుండు శతధన్వుఁడనురాజు, కలఁడు లోకైకవిఖ్యాతయశుఁడు
తద్భార్య శైబ్య యుత్తమపతివ్రత శుభ, లక్షణాన్విత శుభశ్లాఘ్యచరిత
ఆదంపతులు సరోజాక్షు జనార్దను, జపహోమదానపూజావ్రతముల
నెలమి నారాధించి కొలుచుచు నొకనాఁడు, కార్తికమాసమాంగళికపౌర్ణ


గీ.

మాసి నుపవాస ముండి నేమమున గంగ, తోయములఁ దీర్థ మాడి సంతుష్టహృదయు
లగుచుఁ దటమున కేతెంచునవసరమున, నృపతిసఖుఁ డొక్కపాషండుఁ డేగుదెంచె.

321


ఉ.

వచ్చినవానితో నవినివల్లభుఁ డల్లన మాటలాడెఁ గ
న్విచ్చి లతాంగి వానిఁ గని విహ్వలయై కమలాప్తుఁ జూచి వా
క్యోచ్ఛరణంబు మాని చనె నొయ్యన నయ్యవనీశుఁ గూడి సం
పచ్చయపేటియైన ప్రతిభావిలసన్నిజరాజధానికిన్.

322


వ.

ఇట్లు నిజపట్టణంబునకు వచ్చి యథాన్యాయంబుగాఁ బుండరీకాక్షు నక్షీణ
పూజాదికంబులం దుష్టిం బొందించుచుండి రంతఁ గొంతకాలంబునకు నమ్మ
హీకాంతుఁడు నితాంతసమరక్రీడాపరిశ్రాంతుండై యంతంబు నొందిన
నతని కాంతారత్నంబును ధర్మక్రమంబునఁ జితారోహణంబు చేసె. ఉపవాన
దినంబునఁ బాషండసల్లాపంబు చేసినదోషంబున నమ్మేదినీనాథుండు వైదేశా
ఖ్యపురంబునందు శునకంబై జన్మించె. ఆతని యుత్తమాంగనయు సర్వ
లక్షణసంపన్న యై కాశీరాజునకుఁ గూఁతురై జన్మించి జాతిస్మరత్వంబు గలిగి
యుండి.

323


క.

తనతండ్రి పెండ్లి యాడఁగఁ, దనకుఁ బరిణయంబు చేయఁదలఁచిన నపు డ
వ్వనజాతేక్షణ వలదని, జనకుని వారించెఁ గలితజాతిస్మరయై.

324


శా.

ఆకన్యామణి యాత్మయోగభవదివ్యజ్ఞానదృష్టిన్ ధరి
త్రీకాంతు న్నిజవల్లభుం గనియె వైదేశంబున న్నీచనీ