పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వితథంబైన హవిఃకదంబకము భావింపం ఫలావాప్తి యీఁ
జతురంబే యహహా వినందగునె యీజంజాటము ల్వల్కినన్.

311


క.

అనయము క్రతువున మృతి బొం, దిన పశువు దివంబు గనుట నిజమే యట్లై
నను యజమానుఁడు నిజజన, కుని జంపఁగవలదె దివముఁ గూర్చెడికొఱకున్.

312


చ.

ఒకరు భుజింప నన్యులకు నొందదుగా పరితృప్తి శ్రాద్ధముల్
వికలతఁ జేయువారు కడువెఱ్ఱులు తృప్తి నిజంబ యేని యూ
రికిఁ జనువారు చల్దులు ధరించి చనం బని లేద యింటివా
రకుటిలచిత్తులై కుడువ నక్కడవారికిఁ దృప్తి గల్గెడిన్.

313


వ.

ఈయంతయుం జన శ్రద్ధేయముగాఁ దలంచి యుపేక్షింపవలయు. ఆప్తవాదంబు లా
కసంబుననుండి యూడిపడవుగదా! యుక్తియుక్తంబైన వచనంబు గ్రహింప
వలయు. నావచనంబులు మీకు రుచియించినఁ జేయుండని వెక్కుదెఱంగుల
బోధించు మాయామోహుని మతం బవలంబించి పాషండధర్మపరులై వేద
మార్గంబు విడిచి చరించి రంతం గొంతకాలంబు చనిన.

314


క.

హరిహయరథభటకోటి, స్ఫురణము మిన్నందఁ గదలి పోర మహాసం
గర మొనరించిరి దైత్యులు, సురగణములతో సమగ్రశూరత్వమునన్.

315


వ.

ఇట్లు పోరి దేవగణంబులచేత నిహతులైరి. మైత్రేయా! వేదోదితంబైన
స్వధర్మంబు వారికిఁ గవచంబై యుండె. నట్టి వేదమార్గంబు విడుచుటం జేసి
నష్టకవచు లైరి, దేవగణంబులు సుఖించి రని చెప్పి పరాశరుండు మైత్రేయున
కి ట్లనియె.

316


క.

మాయామోహోదితమగు, మాయామార్గమున నడుచు మనుజుఁడు నగ్నుం
డీయర్థమునకు సంశయ, మేయెడల న్లేదు మునికులేశ్వర వింటే.

317


వ.

బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, పరివ్రాట్సంజ్ఞలుగల యాశ్రమంబులు
నాలుగు గాని యేనవయాశ్రమంబు లేదు. ఎవ్వండేని క్రమంబున నాశ్రమధర్మం
బులు నడపకయుండు నప్పాతకుండు నగ్నుం డనంబరఁగు. శక్తుం డయ్యును నిత్య
కర్మంబు నడపండేని యద్దనంబుననే యతండు పతితుం డగు. ఆపద లేకయు,
నొక్కపక్షంబు నిత్యక్రియాహాని చేసినను మనుజుండు మహాప్రాయశ్చిత్తం
బున శుద్ధుం డగు. సంవత్సరంబు క్రియాహాని చేసిన మనుజునిఁ జూచి సూర్యావ
లోకనంబు చేయవలయు. ముట్టిన సచేలస్నానంబు చేయవలయు. సంవత్సర
క్రియాహానికరునకు శుద్ధి లేదని వేఱ చెప్పనేల? దేవర్షిపిత్రతిథిభూతంబులం
దృప్తులం జేయనివానికన్నఁ బాతకుండు లేఁడు. అట్టి పాతకితో యానాసనపరి