పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

దివాభాగంబున నుత్తరాభిముఖుండును, నిశాభాగంబున దక్షిణాభిముఖుండును
నై విణ్వూత్రంబులు విడువవవలయును. ఆపదయైన నేముఖంబైన దోషంబు
లేదు.

156


గీ.

ధరణి తృణమునఁ గప్పి మస్తకము కప్పి, తడవు చేయక నిట్టూర్పు లడరనీక
మౌనియై విడువందగు మలము మూత్ర, మును సదాచారనిరతుండు జనవరేణ్య.

157


వ.

పుట్టమన్ను, నెలుకమన్ను, నింటిలోనిమన్ను, శౌచశేషం బైనమన్ను, గోడపూఁత
మన్ను, దుక్కిమన్నును శౌచంబునకుం గాదు. గృహస్థుల కొక్కమృత్తిక లిం
గంబునందును, మూఁడుమృత్తికలు గుదఁంబునను, బదిమృత్తికలు వామక
రంబున, మఱియు హస్తద్వయంబునఁ, బాదంబుల నొక్కటొక్కటిం బెట్ట
వలయు. స్వచ్ఛంబును, దుర్గంధఫేనవర్జితంబును నగుజలంబున శౌచంబు
చేయవలయు. అనంతరంబు పాదశౌచంబు చేసి కృతాచమనకార్యుండై,
కేశప్రసాదనంబు చేసి, మాంగళ్యదూర్వారంబుల ధరించి.

158


గీ.

తనకులాచారధర్మంబు తప్పకుండ, నర్థ మార్జించి యజయించు టర్హవిధము
హవియు సోమంబు నన్నంబు నర్థమునను, కలుగు గావున నర్థంబు వలయుఁ గూర్ప.

159


వ.

నదీతటాకజలంబుల, దేవఖాతజలంబుల, గిరిప్రస్రవణజలంబుల, గూపోద్ధృత
జలంబుల, గృహానీతజలంబులనైన స్నానంబు చేసి శుచివస్త్రధరుండై పితృ
తీర్థంబున నంజలిత్రయంబునఁ బితృతర్పణంబు చేసి జలత్రయంబున దేవర్షి
తర్పణంబు చేసి పితామహప్రపితామహులకును, మాతృమాతామహతత్పితా
మహప్రభృతులకును, గురుపత్నీగురుమాతులాదులకు, రాజునకు నుపకా
రార్థంబు భూతంబులకుఁ దర్పణంబు చేసి దేవాసురయక్షనాగగంధర్వరాక్షస
పిశాచగుహ్యకసిద్ధకూష్మాండతరుఖగబిలేశయభూనిలయవాయ్వాహార
జంతువులును, నరకయాతనాసంస్థితులును, బాంధవులును, నబాంధవులును,
జన్మాంతరబాంధవులును, మద్దత్తతిలోదకంబులచేత నాప్యాయనంబు నొందు
దురు గాక యని కామ్యోదకదానంబు చేసి పుణ్యంబు నొందు.

160


క.

ఆచమనము చేసి విశు, ద్ధాచార్యుండైన మనుజుఁ డర్యమునకు గా
లోచితగతి నర్ఘ్యంబులు, నేచలకము లేనిబుద్ధి నియ్యగవలయున్.

161


శ్లో॥

నమో వివస్వతే బ్రహ్మభాస్వతే విష్ణుతేజసే।
జగత్సవిత్రే, శుచయే సవిత్రే. కర్మసాక్షిణే॥

162


వ.

అను మంత్రం బుచ్చరించుచు సూర్యార్ఘ్యం బీయవలయు.

163