మహర్షులచేత వ్యస్తంబయ్యె. ఈ వైవస్వతమన్వంతరంబున ద్వాపరయుగం
బుల నిరువైయెనమండ్రు వ్యాసులు చనిరి. ప్రథమంబు ద్వాపరంబున స్వాయం
భువుండు తాన వేదంబు వ్యస్తంబు చేసె. ద్వితీయద్వాపరంబునఁ బ్రజాపతి
వ్యాసుండయ్యె. తృతీయద్వాపరంబున శుక్రుండు, చతుర్థద్వాపరంబున బృహ
స్పతి, పంచమద్వాపరంబున సవిత, షష్ఠద్వాపరంబునఁ బ్రభువైన మృత్యువు,
సప్తమద్వాపరంబున నింద్రుండు, అష్టమద్వాపరంబున వసిష్ఠుండు, నవమ
ద్వాపరంబున సారస్వతుండు, దశమద్వాపరంబున శ్రీధాముండు, ఏకాదశం
బునఁ ద్రికృష, ద్వాదశంబున భరద్వాజుండు, త్రయోదశంబున నంతకుండు,
చతుర్దశంబున ధర్ముండు, పంచదశంబునఁ ద్రయ్యరుణుండు, షోడశంబున ధనం
జయుండు, సప్తదశంబునఁ గృతంజయుండు, అష్టాదశంబున ఋణంజయుండు,
తదనంతరంబు భరద్వాజుండు, తదనంతరంబ గౌతముండు, తదనంతరంబ
హర్యాత్మ, తదనంతరంబ వేనుఁడు, తదనంతిరంబ వాజశ్రవుండు, తదనంతరం
బ సోముండు, తదనంతరంబ శుష్మాయణుండు, తదనంతరంబ తృణబిందుండు,
తదనంతరంబ ఋక్షుండు, తదనంతరంబ వాల్మీకి, అవ్వల నస్మజ్జనకుండైన శక్తి,
తదనంతరంబ నేను, నాతరువాత జతికర్ణుండు, అవ్వల కృష్ణద్వైపాయనుండు.
ఈయిరువదియెనమండ్రును నతీతవ్యాసులు. వీరిచేత వేదంబు నాలుగువిధం
బుల ద్వాపరాదులయందు విభజింపంబడియె వినుము.