పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇంద్ర, దేవ, సప్తర్షి, మను, మనుపుత్రులు మన్వంతరాధికారులుగా నెఱుం
గుము. ఇట్లు చతుర్దశమన్వంతరంబులు సహస్రయుగపర్వతంబగు నొక్క
దివసం బగు. అది యొక్కొక్కకల్పం బనంబరంగు. రాత్రియుఁ దావత్ప్ర
మాణమై వర్తిల్లు.

37


చ.

కమలజుఁడౌ రమాపతి జగంబులు మూడును మ్రింగి శేషత
ల్పమున లయాంబురాశిసలిలంబులపైఁ బవళించి తన్నిశాం
తమునఁ బ్రబుద్ధుఁడై సుజనతత్పరతన్ భువనాళిఁ దొంటిచం
దమున సృజించు రాజనగుణప్రచురీభవదాత్మతంత్రుఁడై.

38


క.

మనువులు ఋషు లింద్రుండును, మనుపుత్రులు దివిజులును రమావిభువంశం
బనుపమసత్వోద్రిక్తం బని యెఱుఁగుము నీమనమున నార్యప్రణుతా.

39


వ.

చతుర్యుగంబులందు నీవిష్ణుదేవుఁడు స్థితివ్యాపారలక్షణుండై యుగవ్యవస్థలు
నడుపు. కృతయుగంబునఁ గపిలాదిరూపధారియై సర్వభూతహితరతుండై
విమలజ్ఞానదానంబు సేయు. త్రేతాయుగంబునం జక్రవర్తిస్వరూపంబున జగ
ద్రక్షణంబు సేయు. భూత, భవిష్య, ద్వర్తమానకాలంబుల జగంబులు రక్షించు.
మైత్రేయ! మన్వంతరంబులు చెప్పితి నిఁక నేమి చెప్పవలయుననిన గురువునకు
శిష్యుం డిట్లనియె.

40


క.

వేదవ్యాసమునీంద్రుఁడు, వేదద్రుమ మేవిధమున విభజించెఁ దదీ
యాదృతశాఖల వెన్ని, శుభోదయుఁ డతఁ డెన్నిమారు లుదయించె మహిన్

41


క.

హరి పుట్టించు జగంబులు, హరియందును నిలుచుఁ బొలియు హరివలననె యా
హరికన్న సృష్టిరక్షణ, హరణములకు లేదు కారణాంతర మరయన్.

42


వ.

అని యడిగిన శ్రీపరాశరుం డిట్లనియె.

43


క.

వేదతరువునకు శాఖా, భేదములు సహస్రము లవి పేర్కొని చెప్పన్
గాఁ దరమె యైనఁ జెప్పెద,. నాదృతి సంక్షేపమున మహాత్మా తెలియన్.

44


గీ.

తామరసలోచనుఁడు ప్రతిద్వాపరమున, నతులితప్రభ వ్యాసుఁడై యవతరించి
యేకమగు వేదరాశి ననేకభంగి, వెలయఁజేయు జగద్ధితకలనఁ గూర్చి.

45


క.

బలవీర్యబుద్ధితేజము, లలవడ నల్పములు మానవాదుల కని య
య్యలఘుండు వేదభేదము, లెలమి నొనర్చెం దదీయహితమతి యగుచున్.

46


వ.

వేదంబులు విభజించి విస్తరించుటం జేసి వేదవ్యాసుం డన వాసుదేవుండు వెలయు.
వినుము. ఈవైవస్వతమన్వంతరంబున నిరువదియెనిమిదిమార్లు వేదంబు