పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లంగల సప్తనదులుగలవు. మఱియుందక్కినక్షుద్రనదులును, గిరులును,
అయుతసంఖ్యలు కలవు. ఈవర్షంబులు స్వర్గతుల్యంబులై, ధర్మసమేతంబులై
యుండు. ముద్ర, మగధ, మానస, మందగ సంజ్ఞలంగలిగి క్రమంబున
బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ధర్మోపేతులై వర్తిల్లుదురు.

55


క.

శ్రీకాంతాధీశుఁడు సూ, ర్యాకృతిధరుఁ డగుచు నధ్వరార్చితుఁ డగు సు
శ్లోకులగుమానవులచే, శాకద్వీపంబునందు సౌజన్యనిధీ.

56


సీ.

ఋషివర ముప్పదిరెండులక్షలయోజ, నముల వెడల్పున నమితమహిమ
గలదుగ్ధవార్థి శాకద్వీపధరఁ జుట్టి, పొలుపొందు నవ్వల పుష్కరాఖ్య
మైనద్వీపముగల దఱువదినాలుగు, లక్షలమితమున శ్లాఘ్య మగుచు
తద్ద్వీపపతియగు ధార్మికాగ్రణిసవ, నుండు పుత్రకులు సన్నుతచరితుల


గీ.

నిరువురిని గాంచి వారికి నిచ్చె ద్వీప, మమ్మహాత్ములపేర దివ్యంబులైన
వర్షములు రెండు వెలయు పావనము లౌచు, వినుము తన్నామధేయము ల్మునివరేణ్య.

57


వ.

మహావీరుండును, ధాతకియు నన వారిపేర పుష్కరద్వీపంబున మహావీరవర్షం
బును, ధాతికివర్షంబును ననం బరఁగె. ఆరెండువర్షంబులనడుమ లక్షయు నేబది
వేలయోజనంబులపొడవును, నంతియవెడల్పును నై మానసోత్తరంబును,
వర్షపర్వతంబు పుష్కరద్వీపమధ్యంబున నుభయ౦బులకు మర్యాదా
చలం బై మండలాకారంబున నుండు. దానియుభయపార్శ్యంబులం గదా
దుగ్ధాబ్ధిచుట్టున మహావీరధాతకివర్షంబులు వలయాకారంబులై యుండు.
అుందు మానసోత్తరబాహ్యంబున మహావీరవర్షంబును, మానసోత్తరంబు
నకు నివ్వలిభాగంబున ధాతకవర్షంబునును నుండును. అందలి జనులు నిరామయు
లును, నిర్వికారులును, రాగ ద్వేషవర్జితులును, నుత్తములును, ఈర్ష్యాసూయా
భయ, క్రోధ, దోష, లోభాదివర్జితులునునై పదివేలేండ్లు బ్రతుకుదురు.
ఆవర్షద్వయంబునందును నదులును, శైలంబులును లేవు. వర్ణాశ్రమంబు
లును, వర్ణధర్మంబులును, త్రయీ, వార్తా, దండనీతి, శుశ్రూషలును లేవు.
భౌమస్వర్గం బనం బరఁగు నందు దేవతుల్యులై జనులు వర్తిల్లుదురు.

58


ఉ.

ఓధరణీసురప్రవర! యొప్పగు నావెనుదీవి నొక్కన్య
గ్రోధము వ్యోమయానగతి రోధసిరోధకవిస్ఫురన్మహో
చ్ఛేదము దానియందు సరసీరుహగర్భునివాస మొప్పు శో
భాధరితాఖిలామరవిహారనిశాంతనితాంతకాంతియై.

59


వ.

చతుష్షష్ఠిలక్షయోజనవిస్తారంబున స్వాదూదకసముద్రం బాపుష్కరద్వీపం
బుం జుట్టియుండు. ఇవ్విధంబున సప్తద్వీపంబులును సప్తసముద్రంబులచేత