పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అలఘుకుశద్వీపము తా, వెలయుఁ గుశస్తంబసంజ్ఞ విను తత్కుశమున్
చెలువొందును నాలుగుల, క్షలయోజనములమితమున గణుతింపంగన్.

51


గీ.

అష్టలక్షయోజనాతివిస్తారమై, తగుఘృతాబ్ధి వెలయు దానిఁ జుట్టి
యాఘృతాబ్ధిఁ బుట్టియవల క్రౌంచద్వీప, మనఁగ ద్వీప మమరు మునివరేణ్య.

52


వ.

ఆక్రౌంచద్వీపంబు షోడశలక్షయోజనవిస్తారంబై వెలయు, కౌంచద్వీపేశ్వరుం
డైన ద్యుతిమంతునకుఁ గుశలుండును, మనుగుండును, ఉష్ణుండును, పివరుం
డును, అంధకారుండును, మునియు, దుందుభియును నన నేడ్వురుపుత్రులు
పుట్టి క్రౌంచద్వీపంబునకు రాజులైరి. వారిపేరిట సప్తవర్షంబులై దేవ
గంధర్వసేవితంబు లయ్యె. క్రౌంచంబును, వామనంబును, అంధకారంబును,
రత్నశైలంబును, దేవోత్పత్తియు, పుండరీకవంతంబును, దుందుభియును నన
నేడువర్షాచలంబులు పరస్పరద్విగుణంబు లై యుండు. ఈవర్షంబులయందు
వర్షాచలంబులయందు దేవసమానులై జనులు నిరాతంకులై యుండుదురు.
గౌరియు, కుముద్వతియు, సంధ్యయు, రాతియు, మనోజవయు, జ్యోతియు,
పుండరీకయు నను నేడువర్షనదులు గలవు. మఱియు క్షుద్రనదులు సహస్ర
సంఖ్యలు కలవు, పుష్కరపుష్కలధన్యాఖ్యాతసంజ్ఞలం గలిగి చాతుర్వర్ణ
జనంబులు వెలయుదురు.

53


శా.

ఎంచన్ శక్యము గాని వైభవముతో నిజ్యావిశేషంబునన్
చంచద్భక్తి తలిర్పఁగాఁ గొలుతు రిచ్ఛాపూర్తి వర్ధిల్లగా
ప్రాంచల్లీలల రుద్రరూపుఁడగు పద్మాధీశ్వరు న్నిత్యమున్
క్రౌంచద్ద్వీపనివాసులౌ జనులు నిర్ద్వంద్వత్వయుక్తాత్ములై.

54


వ.

షోడశలక్షయోజనవిస్తారంబైన దధిసముద్రం బాక్రౌంచద్వీపధరణిం జుట్టి
యుండు.ఆవల ద్వాత్రింశల్లక్షయోజనవిస్తరంబై శాకద్వీపం బాదధిసము
ద్రంబుఁ జుట్టియుండు శాకద్వీపేశ్వరుండైన భవ్యునకు జలజుండును, కుమా
రుండును, సుకుమారుండును, మరీచకుండును, కుసుమోత్కరుండును, మోదా
రియు, మహాద్రువుండును నన నేడువురుపుత్రులు పుట్టి శాకద్వీపంబునకు రాజు
లైరి. వారిపేర నాద్వీపంబున సప్తవర్షంబు లయ్యె. ఉదయగిరి, జలాధారంబు,
రైవతరశ్యామంబు, అంభోగిరి, అంచికేయంబు, రమ్యంబు, కేసరి అనియెడి
మర్యాదాపర్వతంబులు గలవు. తద్వీపమధ్యంబున సిద్ధగంధర్వసేవితం బై
సర్వాహ్లాదకరంబైన శాకవృక్షంబు వెలయు, తన్నామంబునం గదా యా
ద్వీపంబు శాకద్వీపం బనంబరఁగె. అందుఁ బుణ్యజనపదంబులు పెక్కు కలవు. నుకు
మారి, కుమారి, కధిని, వేణుక, ఇక్షు, ధేనుక, గభస్తి అనునామంబు