పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

లక్షద్వయయోజనమిత, లక్షితమై జలధిఁ జుట్టి ప్లక్షద్వీపం
బక్షీణవైభవాఢ్యజ, నక్షేమద మగుచు వెలయు నవ్యప్రతిభన్.

38


వ.

ప్లక్షద్వీపేశ్వరుండైన మేధాతిథికి శాంతభయుండును, శిశిరుండును, సుభోద
యుండును, ఆనందుండును, శివుండును, క్షేమకుండును, ధ్రువుండును, నన
నేడ్వురుపుత్రులు పుట్టి ప్లక్షద్వీపంబునకు రాజులైరి. వారిపేరన పూర్వవర్షంబు
మొదలుకొని ప్రదక్షిణంబుగాఁ గ్రమంబున శాంతభయవర్షంబును, శిశిర
వర్షంబును, సుభోదయవర్షంబును, ఆనందవర్షంబును, శివవర్షంబును, క్షేమ
కరవర్షంబును, ధ్రువవర్షంబును నన నేడువర్షంబు లయ్యె. ఈవర్షంబులకు
మర్యాదాశైలంబులు గోమేధ, చంద్ర, నారద, దుందుభి, సోమిక, సుమనో,
వైభాజనామంబులం గలిగి యేడుపర్వతంబులు గలవు. ఈవర్షాచలంబుల
యందును వర్షంబులయందును బ్రజలు దేవగంధర్వసహితు లై వసి
యింతురు.

39


గీ.

అందు నధికసమృద్ధంబులైన పుణ్య, జనపదంబులు పె క్కందు జనునకెల్ల
వ్యాధులును నాధులును లేవు వలసినట్లు, సర్వకాలనుఖంబులు సంభవించు.

40


వ.

ఆవర్షంబులకు అను, తప్త, శిఖ, విపాశ, త్రిదివ, అమృత, సుకృత అను
నామంబులంగల సముద్రగామినులైన సప్తనదులు గలవు. మఱియును క్షుద్ర
నదీపర్వతంబులును సహస్రసంఖ్యలు కలవు. తన్నదీజలపానంబు చేసిన జనులు
దేవసమాను లగుదురు. ప్లక్ష, శాల్మల, క్రౌంచ, కుశ, శాకద్వీపంబులను
పంచద్వీపంబులందును త్రేతాయుగసమానకాలంబు వర్తించు. మానవులు
పంచసహస్రవర్షంబులు పరమాయువుగాఁ బ్రదుకుదురు. ఆద్యకులులును,
కురువులును, విదులును, స్వాభావులును ననుసంజ్ఞలం గలిగి క్రమంబున
బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులు వర్తిల్లుదురు. ఆద్వితీయద్వీపమధ్యంబున
జంబూద్వీపప్రమాణంబైన ప్లక్షవృక్షంబులు వెలుగొందు, తన్నామంబు
నంగదా యాద్వీపంబు ప్లక్షద్వీపం బనం బరఁగు.

41


విప్రక్షత్త్రియవైశ్యు ల, తిప్రీతి తలిర్ప నందు దేవోత్తము ల
క్ష్మీప్రియువిహితక్రతుక, ర్మప్రవణమనస్కు లగుచు మదిఁ గొల్తు రిలన్.

42


సీ.

పాండిత్యలక్షణ! రెండులక్షలయోజ, నముల వెడల్పున నమరి యిక్షు
రసపరిపూరితార్ణవము ప్లక్షద్వీప, ధరణిమండలిఁ జుట్టి తనరుచుండు
డంబైన యిక్షురసాంబుధిఁ జుట్టి చ, తుర్లక్షయోజనస్తుత్యమైన
వెడలుపు శాల్మలద్వీపంబు గలదు త, ద్విభుఁడు వపుష్మంతుఁ డభయులైన