పుట:విక్రమార్కచరిత్రము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 5


శ్రీమహాభారత రామాయణాదిపు
        రాణపారీణపౌరాణికులును
వేదాంతవైశేషికాదిషడ్దర్శన
        తర్కకర్కశులైన తార్కికులును
దత్తిలభరతమతంగకోహళమత
        ప్రముఖసంగీతపారంగతులును


తే.

మహిమఁ గొలువంగ నాస్థానమండపమున
జనితసాహిత్య[1]సౌహిత్యసరసగోష్ఠిఁ
జిత్త మిగురొత్త జన్నయసిద్దమంత్రి
కొలువుగూర్చుండి నను వేడ్కఁ బిలువఁబంచి.

19


కవి వంశప్రశంస

సీ.మా.

సంస్కృత ప్రాకృత శౌరసేన్యాదుల
        ఘటికలో నొకశతకంబుఁ జెప్పఁ
బ్రహసన ప్రకరణ బాణాది బహువిధ
        రూపకంబులయందు రూఢి మెఱయఁ
జక్ర చతుర్భద్ర చతురుత్త రాధిక
        క్షుద్రకావ్యములు పెక్కులు రచింప
నాంధ్రకవిత్వంబునందుఁ బ్రబంధంబు
        మేలుగాఁ దద్జ్ఞులు మెచ్చఁ జెప్ప
నిమ్ముల నేరీతి నేధాతువుల నేమి
        రసమున నైన వర్ణనము సేయ
సరి యేకసంధా ద్విసంధా త్రిసంధలఁ
        దొడరినఁ బొరిబొరి గడవఁ జదువ
నెవ్వఁ డేయవధాన మెఱుఁగు నయ్యవధాన
        మున వాని కించుక ముల్లుసూప
వృత్తకందముఁ గందవృత్తంబునుం జతు
        స్కందంబు మొదలుగాఁ గలుగుగర్భ

  1. సౌహిత్య=తృప్తి