పుట:విక్రమార్కచరిత్రము.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

201


వ.

సమిత్కుశార్థంబు దైవవశంబున.

213


క.

వచ్చి యొకద్విజకుమారుఁడు
చెచ్చెర మముఁ జూచి కరుణ చిగురొత్తంగా
గ్రచ్చఱ నయ్యురులూడ్చిన
నిచ్చల మామనికిపట్ల కేఁగితిమి వెసన్.

214


క.

అది చనియును నేఁటికి నిరు
పదియేఁడులు గడచె, నాఁటఁబట్టియు నేనా
మది నాతనియాపద సం
పద నాయదిగాఁ దలంతు బంధుత్వమునన్.

215


క.

అని చెప్పిన విని వచ్చితి
నని చెప్పిన విహగవిభునియాలాపంబుల్
వినియెఁ జెవియొడ్డి భూరుహ
మునక్రింద వసించి యున్నభూమీశ్వరుఁడున్.

216


క.

విని యపుడ కదలి, జామె
క్కినయంతకుఁ జనియె నసురకేలీసదనా
వనిభృత్కంధరభూమికిఁ
దన కిదియ పరోపకృతికిఁ దఱి పొమ్మనుచున్.

217


క.

చని వధ్యశిలాస్థలి న
జ్జనపతి కూర్చుండె నిర్విశంకత, నంతం
గనియె గుహ వెడలి చనుదెం
చి నిశాటుఁడు వధ్యశిల వసించినవానిన్.

218


చ.

కని భ్రుకుటీమహోగ్రపరికంపితఫాలభయంకరాస్యసం
జనితనిదాఘవారికణజాలవిజృంభణరౌద్రమూర్తియై
యనియెఁ గణంగి యోరిమనుజాధమ! నిచ్చలుఁ దెచ్చువంటకం
బును నులివేఁడికూరలు నపూపములు గొనిరా కహంకృతిన్.

219