పుట:విక్రమార్కచరిత్రము.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

విక్రమార్కచరిత్రము


తే.

ఒక్కఁడవ వచ్చి వధశిల యెక్కి నన్ను
నపహసించుచునున్నాఁడ వనుచుఁ దీవ్ర
గమనుఁడై చనుదెంచురాక్షసునితోడ
నృపతి నిశ్శంక నిట్లను నిభృతుఁ డగుచు.

220


చ.

దితినుత! నేఁడు చావ నరుదెంచుమహీసురవర్యుమాఱు వ
చ్చితిఁ బరదేశి, నాచనవు చేకొని మత్తనురక్తమాంసముల్
ధృతిఁ గొను మంతకంటెఁ బరితృప్తి యొనర్చు, మదన్వయక్రమా
గతమగు నిప్పరోపకృతికల్పనఁ బారమునొందఁ జేయుమీ.

221


ఉ.

నావుడు దానవేంద్రుఁడు మనంబున నచ్చెరువంది, సత్కృపా
భావనకుం బరోపకృతిభంగికి మెచ్చితి, వేఁడు మర్థి నీ
కేవర మైన నిచ్చెదఁ బ్రహృష్టమనస్కుఁడ నైతి నీయెడన్
నావుడు విక్రమార్కనరనాథుఁడు నద్దనుజేంద్రుతోడుతన్.

222


ఆ.

ఈవివేకబుద్ధి యీచిత్తసంశుద్ధి
యీకృపారసావసేకసిద్ధి
కలదె యొరుల కెందుఁ గారణజన్ముండ
వగుటఁ జేసి నీక యబ్బెఁ గాక!

223


తే.

నాకు వరమిత్తు ననుమాట నైజమేని
మనుజవధ యొనరింపక మాను మనినఁ
దత్పరోపకారైకతత్పరత కలరి
యట్లచేసెద నని పల్కి యసుర చనియె.

224


వ.

ఇవ్విధంబున.

225


ఆ.

భూపచంద్రముఁడు “పరోపకారార్థమి
దంశరీర" మనినధర్మమార్గ
సరణి దప్పకుండ సకలార్థిరక్షణ
వర్తనమున నిత్యకీర్తిఁ గాంచె.

226