పుట:విక్రమార్కచరిత్రము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

63


భావింవ నరుదైన భావమర్మంబులు
        మెఱుఁగుఁజూపులలోన మేళవించి
తానమానములతోఁ దాళనిర్ణయలీలఁ
        జరణపల్లవముల సంగ్రహించి


తే.

యఖలమును మెచ్చఁ బ్రత్యక్షమైనయట్టి
నాట్యవిద్యాధిదేవత నాఁ దనర్చి
భరతశాస్త్రమర్మజ్ఞతాప్రౌఢి మెఱసె
నూర్వశీకాంత వేల్పుఁబేరోలగమున.

91


వ.

ఇట్లిరువురుం బ్రవర్తించిన నర్తనంబులు గనుంగొని. విక్రమార్కుం డిట్లనియె.

92


ఉ.

సర్వజగంబుల న్నటనచాతురిఁ దాఁ గడుఁబ్రోడ నంచు, దు
ర్గర్వము పూని శాస్త్రగతిఁ గైకొననొల్లక రంభ యాడె, నీ
యూర్వశి శాస్త్రసమ్మతసముజ్జ్వలమార్గము దప్పకుండఁగాఁ
బర్వ మొనర్చె నిచ్చటి సుపర్వుల కెల్లఁ గళాప్రవీణతన్.

93


దేవేంద్రుఁడు విక్రమార్కునకు దివ్యసింహాసనంబు బహూకరించుట

వ.

అనిన, నమ్మహీనాథుని వివేకపరిపాకంబునకుఁ పాకశాసనుండు ప్రముదితాంతఃకరణుండై దివ్యమణిభూషణాంబరాదు లొసంగి, మఱియును నిజతపోవిశేషతోషితాంతరంగంబును, సర్వమంగళాస్పదంబును, నృపసింహాసనద్వాత్రింశత్సాలభంజికారంజితంబునునగు దివ్యసింహాసనంబు నొసంగి, తద్దివ్యపీఠంబుఁ బురంబునకు భరించికొనిపోవఁ ద్రిదశకింకరసహస్రంబు సమర్పించి, గారవించి వీడ్కొలిపిన, దివ్యమణిపాదుకాప్రభావసులభగమనుండై యజ్జనపాలుం డుజ్జయినీపురంబున కరుగుదెంచి.

94


సీ.

శ్రుతిమతంబునఁ బురోహితసమ్మతంబునఁ
        బుణ్యాహవాచనపూర్వకముగ
జలజబాంధవముఖ్యసకలగ్రహంబుల
        కభిమతంబగు హోమ మాచరించి
యన్నదానాది సమస్తదానంబుల
        బ్రాహ్మణప్రతతికిఁ బ్రమద మొసఁగి