పుట:విక్రమార్కచరిత్రము.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

61


గోరి ముప్పదిమూఁడుకోటులదివిజులు
        కొలువంగ నేతేరు కొమరు మిగిలెఁ
బటుజనస్ఫురణమై పదివేలహయములు
        పూనంగ నేతేరు పొలుపు మిగిలె


తే.

నట్టిదివ్యరథంబు నెయ్యమున నెక్కి
సాహసాంకమహీపాలచంద్రుఁ డరిగె
గరుడపవమానమానసాక్రమణనిపుణ
బహుగతిప్రౌఢి కుల్లంబు పల్లవింప.

80


వ.

ఇట్లు చనిచని.

81


ఉ.

నాకముఁ గాంచె నట్టియెడ, నందనమందచరన్నితంబినీ
లోకము, సంయమీంద్రధృతిలోపక లోలవిలాసమేనకా
లోకము, వాసవేభమదలోలుప చంచలచంచరీకమున్
స్వీకృతసత్తపఃఫలవిశేషవిపాకముఁ బుణ్యలోకమున్.

82


వ.

కని తదీయవిలాసోత్కర్షంబునకు హర్షించుచు, సకలజగన్నయనపర్వం బగు సుపర్వాధీశ్వరునగరంబు చొచ్చి రథావతరణంబు చేసి, దివ్యసభామండపంబు ప్రవేశించి.

83


చ.

కనియె నతండు, దివ్యగణికాజననేత్రచకోరికానురం
జన హసచంద్రికాలపనచంద్రునిఁ, జారుపులోమజాఘన
స్తన పరిరంభసంభ్రమవశస్ఫుటకుంకుమపంకసౌరభాం
జనతనుకాంతిరుంద్రుని, భుజాబలసాంద్రుని నిర్జరేంద్రునిన్.

84


క.

కని వందన మొనరించిన
జననాథున కెదురు వచ్చి, సరసాశ్లేషం
బొనరించి, యతని గద్దియ
నునిచికొనెన్ దివిజనాథుఁ డుచితప్రౌఢిన్.

85


వ.

ఇట్లయ్యిరువురు నేకాసనాసీనులై, సముచితసంభాషణంబు లొనరించు