పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

వాసిష్ఠరామాయణము

                    ద్భావంబు లన్నియుఁ బరఁగ నెఱిఁగి,
     ప్రకృతివికృతులను బాసి సమ్మదమునఁ
                    బరమాత్మ నాత్మను బదిలపఱిచి,
గీ. సత్త్వసంవేదనంబును శాశ్వతంబు
     నిత్యబోధాత్మరూపంబు నిర్మలంబు
     నస్తమును నుదయము లేనియట్టివెలుఁగుఁ
     బొంది చిన్మూర్తి వై సుఖింపుము కుమార.41
వ. అని వసిష్టుండు దోమాద్యుపాఖ్యానంబు సెప్పి, యింక దేహాహంకా
     రరాహిత్యంబు పురుషార్ధం బగుట యెఱుంగంబడు భీమాద్యుపాఖ్యా
     నంబు సెస్పెద విను మని యి ట్లనియె.42
గీ. ఎఱుకపడకున్న నహమర్థ మెద్ది యేని
     మలినరూపంబు దోఁచి దంభకము నొందు
     నెఱుకపడియున్న నహమర్థ మెద్ది యేని
     యదియ పరమాత్మ నభము తా నై వెలుంగు.43
వ. ఆ యహంకారంబు జగత్త్రయంబునందు మూఁడు విధంబులై యుం
     డు. నందుఁ ద్యాజ్యం బొక్కటియు, ముఖ్యంబులు రెండునుం గలిగి
     యుండు వినుము.44
గీ. అతుల మమలంబు విశ్వ మచ్యుతముఁ బరము
     నైన పరమాత్మరూపంబు నేనె కాని
     యన్య మొక్కటి లేదని యాత్మఁ దలఁచు
     నదియ యుత్తమాహంకృతి యనఁగఁ బరఁగు.45
గీ. ఆరయ నన్నిట వ్యతిరిక్త మై వెలుంగు
     తాన యాలాపశతకల్పితంబు నగుచు
     నెసఁగు పరమాణురూపంబు నేనె యనెడు
     నా యహంకార మది ద్వితీయంబు శుభము.46