పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

95

     నక్కడ వారియాత్మల నహంకరణంబు జనించి యంతటన్.36
క. ఆ దామవ్యాలకటుల్
     మోఁదంబడి జీవితాశ మునియోగంబుల్
     భేదిలి మీ కగపడుదురు
     వేదనఁ టెనువలలఁబడినవిహగములగతిన్.37
గీ. ఎట్టి ధీరులకును నెట్టన సంసార
     తృష్ణ వొడమి తొంటితెలివి నణఁప,
     నిగళబద్ధ మైనమృగరాజుభంగి యై
     చిక్కుపడి నశించు నక్కజముగ.38
వ. అని యుపదేశం బిచ్చి పరమేష్ఠి యంతర్ధానంబు నొందె. దివిజగణం
     బులు నిజనివాసంబున దామాదులతో సమరంబు సేసి యోహరిసా
     హరిం బెనఁగి విచ్చుచుం బొదువుచుండి, రంత నారాక్షసులు జయా
     హంకారచిత్తు లై దేహసుఖధనవాన లగ్గలించి మరణభయం
     బున ముందఱఁ గాననేరక యింధనక్షీణం బగుననలంబును బోలె
     సత్త్వంబులు పొనుంగువడి దివిజులకు నోడి కనికని పఱచి రని సెప్పిన
     విని కౌసల్యానందనుం డి ట్లనియె.39
క. దామవ్యాలకటాసురు
     లేమెయిఁ బరమాత్మువలన నెటు పుట్టి రొకో?
     నామది సంశయ మయ్యెడు
     ధీమన్నుత నాకు నాన తీవే యనుడున్.40
సీ. అమ్మహామౌని యి ట్లనియెను – రాఘవ,
                    తనరుదామాదులజనన మరయఁ
     బరమాత్మవిప్రతిభాతిమాత్రము గాని
                    సత్యమ్ము గాదు; సంశయ మ దేల?
     నిగిడి వా రన నేల, నీవును నోలి న