94
వాసిష్ఠరామాయణము
దురిత మెడలి భోగతుష్టి యెసఁగు,
చోరుఁ డౌట యెఱిఁగి పోరామి సేసిన
ప్రియునియిల్లు తస్కరింపనట్లు.33
వ. ఎ ట్లనినఁ బథికుండు మార్గగ్రామంబులు సూచుచుం జనుభంగి,
గృహస్థితుం డుదాసీనభావంబున భోగంబు లల్పమాత్రంబు భోగిం
చినను దూష్యత లేక యుండు. ఏ యుపాయంబున నైనం జిత్తంబు
నింద్రియంబుల జయించి సంసారపారావారోత్తరణంబు సేయు; మట్లు
సేయ వైతేని, దామవాక్యలకటన్యాయంబునం బోలె దుఃఖంబు ప్రా
ప్తించు నత్తెఱం గాకర్ణింపుమని వసిష్ఠుండు రామచంద్రున కి ట్లనియె.34
దామవాక్యలకటోపాఖ్యానము
సీ. శంబరనామరాక్షసుఁ డొక్కఁడును దొల్లి
యమరసైన్యము గెల్వ నాత్మఁ గోరి,
తలపెట్టుకొన్నంతఁ దనయోధు లందఱు
భయ మంది నల్లడఁ బాఱ, వాఁడు
కోపించి, తనమాయఁ గోరి దామవ్యాల
కటనామభటుల నక్కజము గాఁగ
సృజియింప, వారును విజయాశ దేహాభి
మానంబు నెడలి యమర్త్యబలము
గీ. సమయఁ జూచిన దివిజులు సంచలించి
చెదరి నలుదిక్కులను బాఱి చేష్ట లెడలి
సంభ్రమంబునఁ బఱచి యాజలజభవుని
వెనుకఁ జొచ్చిన వారి కి ట్లనియె ధాత.35
ఉ. అక్కట మీకు నింతభయ మందఁగ నేటికి వారి నోర్చు లా
గొక్కటి సెప్పెదన్ వినుడు; యుద్ధమునం దలపాటు సేసి, మీ
రక్కడ నక్కడన్ విఱిగినట్లు తొలంగుచుఁ బోరుచుండఁగా