పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

93

     వాలినవేడ్క వచ్చి, చెద పట్టినభార్గవుడొక్కఁ గాంచి, ర
     క్కాలువరంబుచే నతఁడు గ్రక్కున నందు వసించి, చేయునుం
     గాలుఁ గదల్చి లేచి మదిఁ గౌతుక మందుచునుండె, రాఘవా.29
క. మానుగ సంసారస్థితి
     మానసమున నొదవు టెఱుఁగుమార్గం బీయా
     ఖ్యానంబున నెఱింగించితి,
     మానసనిగ్రహమ శాంతి మనుకులతిలకా.30
వ. అని యిట్లు శుక్రోపాఖ్యానం బెఱింగించి, వసిష్ఠుండు రామచంద్రున
     కి ట్లనియె. వినుము వివేకంబును జిత్తశాంతి వొడము; తత్క్షణంబ సం
     సారం బణంగిపోవు; వివేకహీనునకు సంసారవృద్ధి యగుచుండు.
     నీ యర్థంబును దామాద్యుపాఖ్యానంబునం దేటపఱుతు; నాకర్ణిం
     పుము.31
సీ. కృతవిచారుం డగునతనిచేతోవృత్తి
                    మననవర్జితమునఁ బొనుఁగువోవ,
     నొకకొంతపరిణత నొంద సంసారవా
                    సన యెలుకలు దిన్నచామలట్ల,
     రాగహీనత మనోగ్రంథిఁ ద్రెంపఁగ నీళ్ల
                    కలక నిండుపు రాచి తెలుచుభంగి,
     విజ్ఞానవశమున వెలయుస్వభావంబు
                    నిత్యప్రసన్న మై నెగడుచుండు,
గీ. నట్టియోగికి బ్రహ్మరుద్రాదిసురులు
     కృపకు, దగుపాత్రు లై యుండ్రు కేవలంబు
     కన్ను లూరక చిక్కులు గాంచుపగిదిఁ,
     జిత్తరతి లేక కార్యంబు సేయుచుండు.32
గీ. ఎఱుక గలుగుయోగి యెట్లు భోగించిన