పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

వాసిష్ఠరామాయణము

     మునినాయక నీసుతుండు మోహాంధతచేన్.23
ఉత్సాహ. మఱియుఁ బెక్కుయోనులందు మహితచిత్రగతులఁ బెం
     పఱి జనించి దుఃఖభాజి యై చరించి, వెండియున్
     వఱలు విప్రవరునియింట వాసుదేవుఁ డనఁగ, దా
     నెఱుక గలిగి పుట్టె వేల్పుటేటితీరభూమినిన్.24
వ. జటావల్కలధరుండును రుద్రాక్షమాలాలంకృతుండును నింద్రియ
     వర్జితుండును నత్యంతనియతాచారుండును నై యెనుఁబది నూ రేం
     డ్లును గోలెఁ దపంబు సేయుచున్నవాఁడు నీకుమారుం జూడవలయు
     నేని చూపెద, నీవు సుజ్ఞానదృష్టి నీక్షించి దివ్యదేహంబు గైకొని
     రమ్మనుటయు, భృగుం డట్ల సేయ, నయ్యిద్దఱును దపఃకృశుం డగు
     శుక్రుకడకుం జని, యతనికి జ్ఞానోపదేశంబు సేసిన, శుక్రుండు నున్మీలి
     తవదనుం డై, తనవృత్తాంతంబంతయుం దెలిపి, తండ్రిం గని నమస్క
     రించి, యి ట్లనియె.25
క. మాయాభ్రమ చిత్తం బిటు
     సేయ విజృంభించె వృద్ధసేవ దొఱంగెన్
     వే యోనుల జనియించితిఁ;
     బాయక పెక్కేండ్లు దుఃఖపడితిని దండ్రీ.26
గీ. ఎఱుఁగవలసిన వెల్ల నే నెఱుఁగఁ గంటిఁ,
     జూడవలసినయర్థంబు చూడఁ గంటి,
     భ్రాంతి యంతయు దీరి విశ్రాంతి గంటి,
     నొనర చిన్మాత్రమునకంటె నొండు లేదు.27
వ. అయ్యా మత్పూర్వశరీరంబు మందరతటంబున నున్నయది, చూడ
     వేడుక యయ్యెడు, బోదమె! యని పలుకుటయు, నాక్షణంబ.28
ఉ. కాలుఁడు శుక్రుఁడున్ భృగుఁడుఁ గ్రమ్మఱ మందరశైలభూమికిన్