పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

91

     పరిచర్య సేయంగఁ బణఁతి విశ్వాచి నా
                    నమరకామిని దివి నరుగఁ జూచి,
     తమకించి నిజశరీరము డించి వరదివ్య
                    దేహుఁ డై దానితో దివికి నరిగి,
     కామలీలలఁ బెద్దకాలంబు భోగించి,
                    యంతట భోగజరాత్ముఁ డగుచు
గీ. శోణపురమున నొక్కభూసురునికూర్మి
     తనయుఁడై పుట్టి, వెండి యత్తనువు విడిచి
     కోసలక్షోణిపాలుఁ డై కొంతకాల
     మవని బాలించి, మఱి దండ కాటవులను.20
వ. మృగవ్యాధుం డై జనియించి, మఱి భాగీరథీతీరంబున రాజహంస
     యై జననం బంది విహరించి, పౌండ్రదేశంబున నినవంశజాతుం డై
     నేలఁ బాలించి, మఱియు సాళ్వదేశంబున సౌరమంత్రోపదేశకుం డై
     యుదయించి, మఱి యలకాపురంబున విద్యాధరుండై కొంతకాలంబు
     చరియించి, వెండియు నొక్కమునికుమారుం డై సరస్వతీతీరంబునఁ
     దపంబు జేసి తద్దేహంబు విడిచి, సౌవీరదేశంబున నొక్కసామంతుండై
     కొంతదేశం బేలి, యంత త్రిగర్తదేశంబున శైవారాధ్యుండై శిష్యుల
     బోధించు చుండి, కడచని మఱియును.21
గీ. విను కిరాతదేశమున నొక్కచో వంశ
     గుల్మ మై జనియించి, కోరి మఱియు
     శ్వానజాంగలమున జనియించి, హరిణ మై
     వెడలి, యొకలతానివేశ మందు.22
క. పెనుఁబా మై తిరుగుచుఁ ద
     త్తను వెడలి తమాలవనలతాజాలమునన్
     వనకుక్కుట మై పుట్టెను,