పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

89

     న్నులుఁ దెలిమొగముఁ గనుంగొని
     వలరా జస్త్రములఁ జిత్తవాసనఁ గలఁపన్.7
క. ఆనాతిఁ గవయువేడుక
     మానుషతను వుజ్జగించి మది దివ్యాంగం
     బూని గగనమున కెగసెను
     దానివిమానంబుఁ గూడ తరలాత్మకుఁ డై.8
వ. ఇవ్విధంబునం జని శుక్రుం డక్కాంతామణితోడి కామసౌఖ్యంబులు
     పెద్దకాలం బనుభవించి మఱియు ననేకజన్మాంతరసుఖముల నలజడిఁ
     బకుచుండె. నిక్కడ నమ్మహానుభావుశరీరంబు తజ్జనకుని తపోమహ
     త్త్వంబునం జేసి వ్యాఘ్రకీటకాదిక్షుద్రజంతువులు డగ్గఱ రా వెఱచి
     యుండ నతిశుష్కంబై యుండె. నంత దివ్యవర్షసహస్రంబులకు
     నాభృగుమహాముని సమాధి దెలిసి యున్మీలితనయనుం డై నలుది
     క్కులుం జూచి తనయొద్దను పడియున్న పుత్త్రకళేబరంబుఁ గాంచి
     శోకక్రోధంబులు మనంబును బెనంగొన ని ట్లనియె.9
గీ. అడవిఁ దప మాచరించుపుణ్యాత్ము విప్రు
     నాత్మవిదు మత్తనూభవు నదటు లేక
     నిగిడి చంపినశమనుని నీఱు సేయు
     వాఁడ నీప్రొద్దు మత్కోపవహ్ని ననుడు.10
వ. భయసంభ్రమాయత్తచిత్తుఁ డై తత్క్షణంబ.11
క. ఘనమహిషకంఠఘంటా
     స్వనమును భటహుంకృతులును జటులత మెఱయన్
     మునిశార్దూలునిపాలికిఁ
     జని వినయావనతుఁ డగుచు శమనుఁడు పలికెన్.12
గీ. అకట పెద్దకాల మబ్భంగిఁ జేసిన
     తపము వీటిఁబోవఁ దామసమున