పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

వాసిష్ఠరామాయణము

శుక్రోపాఖ్యానము

సీ. చిత్రవర్ణంబులుఁ జిత్రకుండును లేక
                    మింటఁ జిత్తరు వొంది మించినట్లు,
     పటుశిలాస్థలమున బహురేఖ లున్నట్లు
                    కల నిద్ర వోవక కాంచినట్లు,
     సాక్షిభూతంబును స్వచ్ఛంబు నిత్యంబు
                    నై వెలింగెడు పరమాత్మయందు
     ప్రతిబింబ మై జగత్ప్రచయంబు వెలుఁగొందు
                    నద్దంబులో నీడ యలగునట్లు,
గీ. కార్యకారణ మిద యని కాన రాదు
     వేఱ యొండొక రూపంబు వెదకి రేని
     యట్టి బ్రహ్మైకమూర్తి జిదాత్ముఁ బరము
     నాత్మలో నిల్పి శాంతుఁడ వగు కుమార.5
తరువోజ. విను రామ భృగుఁ డను విప్రసత్తముఁడు,
     వెలయు మందరశైలవిపినంబునందు
     ననుపమయోగసమాధి మైఁ బూని
     నయుతాబ్దములు నిల్వ నమ్మహామౌని
     తనయుడు శుక్రుఁ డుదాత్తమానసుఁడు
     తనతండ్రికడ నుండఁ, దగ నొకనాఁడు
     ఘనమార్గమున సురకాంత విశ్వాచి
     కర మొప్ప మెఱుఁగుఁదీఁగయుఁబోలెఁ జనఁగ.6
క. తల యెత్తి యాతలోదరి
     కలికికనుంగవయు నీలకచమును వలిచ