పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాసిష్ఠరామాయణము

తృతీయాశ్వాసము

క. శ్రీకర శ్రీముఖకమలది
     వాకర యదువృష్టిభోజవంశామృతర
     త్నాకరపూర్ణసుధాకర
     నారాహితదళనచాప నరమృగరూపా.1

స్థితిప్రకరణము

వ. దేవా సకలతత్త్వార్థవివేకి యగువాల్మీకి భరద్వాజున కి ట్లనియె.
     అ ట్లుత్పత్తిప్రకరణంబు విని రామచంద్రుండు వసిష్టమహామునిం గనుం
     గొని కరకమలంబులు ముకుళించి యి ట్లనియె.2
క. మునినాథ నీ ప్రసాదం
     బున సర్వజగంబు చిత్తమునఁ బుట్టుట నా
     మనసు విడుచుటయ ముక్తియు
     నని తెలియఁగ వింటి నతికృతార్థుఁడ నైతిన్.3
వ. అనిన విని వసిష్ఠుండు రఘునందనున కి ట్లనియె. ఈ జగత్ప్రచయంబు
     మనంబునం జనియించి యంద యుండు; నంద చిత్తంబు పరమాత్మ
     యగు. ఈయర్థంబున స్థితిప్రకరణంబు సెప్పంబడు. నందు శుక్ర దామ
     భీమ దాశూర కచగాథలను నుపాఖ్యానపంచకంబు గలిగియుండు;
     నందు సంసారంబు పరమాత్మయం దున్న చందంబున శుక్రుచిత్తం
     బునం గానంబడు; తత్కథ వినుపింతు నాకర్ణింపుము.4