పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

వాసిష్ఠరామాయణము


నది సుఖేచ్ఛాఖ్య యండ్రు వేదాంతవిదులు.

276


గీ.

శాస్త్రసత్సంగవైరాగ్యసమితి గలిగి
సద్విచారప్రవర్తన సలుపుచున్న
నది విచారణ యనంబడు ననఘచరిత;
యిదియ రెండవభూమి యై యెసఁగు చుండు.

277


క.

ఈ రెంటిని మనమున నిడి
దారుణవిషయేంద్రియములఁ దగులక మననం
బారఁ దనుత్వము సేయుట
యారయఁ దనుమానసాఖ్య యగుబోధనిధీ.

278


గీ.

అనఘ యీ మూఁడుభూముల నభ్యసించి
యర్థవాంఛలు డించి సత్త్వాత్మనిష్ఠఁ
దగిలి శుద్ధాంతరంగుఁడై తలఁపు లుడిగి
పరఁగుచుండుట సత్త్వసంప్రాప్తి యండ్రు.

279


క.

కూరిన యీనాలుగు మది
వారక తలపోసి సంగవర్జితుఁ డయి స
త్త్వారూఢస్థితి నుండుట
యారయ సంసక్తినామ మగు దాశరథీ.

280


వ.

ఈ యేనుభూముల నెఱిఁగి స్వాత్మారాముం డయి బాహ్యాభ్యంతరం
బులం బదార్థంబులు లేమి తెలిసి పరమార్థంబు తెలియుట
పరార్ధభావన యనం బరఁగుచుండు.

281


గీ.

ఆఱుభూములగతులును నాత్మ నెఱిఁగి
యేమిటను నైన భేదంబు లేమి దెలిసి
తత్స్వభావైకనిష్ఠ మైఁ దనరు నెఱుక
తుర్యగయటండ్రు బుధులు చాతుర్యహృదయ.

282


వ.

తుర్యగావస్థయె జీవన్ముక్తి యనంబడు. మఱి విదేహముక్తివిషయంబు