పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

85


తుర్యగా తీతం బగు. నని చెప్పి వసిష్ణుండు మఱియు ని ట్లనియె.

283


సీ.

పొలిచెడి సప్తమభూమిక యగుతుర్య,
        గావస్థఁ బొందిన యట్టి పుణ్యు
లమలు లాత్మారాము లధ్యాత్మవేత్తలు
        భాగ్యవంతులు పరబ్రహ్మయోగి
పరు లనామయులు జీవన్ముక్తు లగువారు
        సుఖదుఃఖరసముల సుళ్లు పొంది
మునుఁగ, రేయాచారమును జేయ నొల్లరు,
        సేయంగ వలసినఁ జేసికొండ్రు,


గీ.

తనరు సంసారసుఖముల ననుభవింతు,
రలసి తెప్పిరి నిద్రించి తెలిసినట్లు
మరులుసతి బాలుగతి మాట మఱచుచుందు.
రిదియ నిర్వాణపద మని యెఱుఁగు రామ!

284


క.

జ్ఞానాజ్ఞానములకు సో
పానం జగుచున్న సప్తభౌమాఖ్యానం
బే నెఱి నీ కెఱిఁగించితి
భానుకులోత్తంస రామభద్ర మహాత్మా.

285


వ.

అని వసిష్ఠమహాముని రామచంద్రున కుత్పత్తిప్రకరణంబును, మనోవి
లాసంబున సృష్టి పుట్టుటయుఁ, దత్త్యాగంబున నశించుటయు, దృష్టాం
తంబు లగునుపాఖ్యానంబుల వ్యాఖ్యానంబు సేసె; నని సెప్పుటయు
విని సంతుష్టాంతరంగుండై భరద్వాజుం డట మీఁదివృత్తాంతంబు
వినిపింపు మని యడిగిన.

286


తురగగతివృత్తము.

బ్రకటదితిసుతజఠరగళదురురక్తసిక్తనఖాంకురా
సకలమునిజనహృదయసరసిజచారుషట్పదనాయకా