పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

83


పెక్కుగతులభ్రాంతి బెరయుట స్వప్నంబు
రఘుకులాబ్ధిచంద్ర రామచంద్ర.

272


గీ.

పెద్దకాల మేని తద్దయుఁ దఱుచుగాఁ
జూడకుండి పిదపఁ జూచి తెలియు
జ్ఞాన మదియ స్వప్నజాగ్రత్తు నాఁబడు
ననిరి బోధవేత్త లైనమునులు.

273


క.

జడ నొంది యిపుడు సెప్పిన
షడవస్థలఁ దొఱఁగి దుఃఖజాలము మదిలో
నెడఁబాపి భావిదుఃఖము
బొడఁగనఁబడనిది సుషుప్తి భూరివివేకా.

274

జ్ఞానభూమికోపాఖ్యానము

వ.

ఆ వ్యవస్థలయందు సకలజీవులును దమోలీనం బయి యుండు. నవి
యజ్ఞానసప్తావస్థ లనం బడు. నానారూపంబుల నసంఖ్యంబు లయి
యుండు. నింక జ్ఞానభూము లేర్పడం జెప్పెద. నవి బెక్కువిధంబులు
గల వని యోగిజనంబుల చేత వినం బడు. వీని నెఱింగినయతండు
దుఃఖపంకంబునం బొరయక నిత్యసుఖంబు లనుభవించునట్టిమతం
బొక్కటి సెప్పెద; నది యెయ్యది యనిన– ప్రథమంబు సుఖేచ్ఛయు,
ద్వితీయంబు విచారణయుఁ, దృతీయంబు తనుమానసంబును, జతు
ర్థంబు సత్త్వస ప్రాప్తియు, బంచమంబు సంసక్తియు, షష్ఠంబు
పరార్థభావనయు, సప్తమంబు తుర్యగయు, నన నీసప్తభూమికలు
ముక్తిమార్గంబులును సకలదుఃఖరహితంబులు నై యుండు. వాని
వేఱువేఱ వివరించెద వినుము.

275


గీ.

'అకట నే నేల మూఢుండ నైతి?' ననుచు
శాస్తృదృష్టిని సజ్జనసంగమమున
దగిలి వైరాగ్యకాంక్షఁ జిత్తమున నూను