ఆ వ్యవస్థలయందు సకలజీవులును దమోలీనం బయి యుండు. నవి
యజ్ఞానసప్తావస్థ లనం బడు. నానారూపంబుల నసంఖ్యంబు లయి
యుండు. నింక జ్ఞానభూము లేర్పడం జెప్పెద. నవి బెక్కువిధంబులు
గల వని యోగిజనంబుల చేత వినం బడు. వీని నెఱింగినయతండు
దుఃఖపంకంబునం బొరయక నిత్యసుఖంబు లనుభవించునట్టిమతం
బొక్కటి సెప్పెద; నది యెయ్యది యనిన– ప్రథమంబు సుఖేచ్ఛయు,
ద్వితీయంబు విచారణయుఁ, దృతీయంబు తనుమానసంబును, జతు
ర్థంబు సత్త్వస ప్రాప్తియు, బంచమంబు సంసక్తియు, షష్ఠంబు
పరార్థభావనయు, సప్తమంబు తుర్యగయు, నన నీసప్తభూమికలు
ముక్తిమార్గంబులును సకలదుఃఖరహితంబులు నై యుండు. వాని
వేఱువేఱ వివరించెద వినుము.