పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

వాసిష్ఠరామాయణము


చిత్తమునఁ దోఁచు చింతలు మెత్తనయిన,
చిత్తశత్రునిఁ దునుమాడి చింత లుడుగు
మనఘ యినుమును నినుముచే దునుమునట్లు.

244


గీ.

పౌరుషంబున సాధ్య మై పరఁగునీప్సి
తముల భోగింపవల దన్నఁ దానె తొలగు;
నట్టి చిత్తంబు నియమింపనట్టిపురుష
కీటకంబులఁ గాల్పనే కిల్బిషారి.

245


సీ.

పొలుచు బ్రహ్మంబునఁ బొంది నిరీహశా
        స్త్రములచేఁ జిత్తకృంతన మొనర్చి
యేకాంతముననుండి యెసఁగుచిత్తమునఁ జి
        ద్రక్షితంబుగఁ జేయఁ దగినయతఁడు
కల్పాంతపవనంబు కడువడి వీచిన
        నంబుధు లొక్కటి యయ్యె నేని
ద్వాదశాదిత్యులు తఱిమి కాసిన నైనఁ
        గల్పశతంబుల గ్రాఁగఁ డతఁడు


గీ.

ఏమి సెప్పుదు నొకచిత్ర మినకులేశ,
నిత్య మై యున్న బ్రహ్మంబు నిగుడ నీక
వినుము నిస్సార మైనయవిద్య దాన
యఖిలజగములు భ్రమఁ బెట్టి యాడుచుండు.

246


వ.

స్ఫటికోపలరచితంబు లగు విచిత్రప్రతిబింబంబులం బోలె నఖిలకార్యం
బులం జేయుచు నిర్మలచిత్తుఁడ వయి యుండు. మని బోధించినఁ, బర
బ్రహ్మమూర్తి యగునమ్మునివాక్యంబులకు వికసితాంతఃకరణుం డయి
రఘుపతి యి ట్లనియె.

247


గీ.

తృణకణాంశంబు వజ్రమై త్రుంచునట్ల
కోరి తామరనూలునఁ గొండ లెల్లఁ