పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

77


చ.

కనుఁగొన నైంద్రజాలికుఁడు గాఁ డితఁ; డట్టిఁడ యయ్యె నేని దా
ధన మభిలాష చేయఁడె? వృథా చనుదెంచి యదృశ్యుఁ డయ్యె; నె
మ్మనము జగద్విలాస మనుమాయిక మెల్ల నుఁ జూప వచ్చిన
య్యనిమిషదూత గాని యతఁ డారయ మర్త్యుఁడు కాఁడు భూవరా.

238


వ.

అట్లు గావున ననంతరూపం బగుపరమాత్మమాయ మనోరూపంబు
దాల్చి జగత్తుల భ్రమలం బెట్టుచుండు, దీనికి జింతింపవలవ దని
సభ్యు లారాజు ననునయించి. రని శాంబరికోపాఖ్యానంబు చెప్పి
వసిష్టుండు రఘునందనున కి ట్లనియె.

239


గీ.

అనఘ యల్పకాలమునన పెక్కేఁడులు
జరుగు టెల్ల నింద్రజాలమహిమ
యెంత సేసి రంత యెదుగు మనోమాయ;
యెంత యెడసి రంత యెడయుఁ దండ్రి.

240


వ.

సమయమంబున మనశ్శాంతి యగుఁ; దచ్ఛాంతిని మననవర్జితంబును
నుత్తమపదధ్యానంబును నగు; మందరంబు సముద్రంబునుం గలం
చినట్లు సంసారసంభ్రమం బుడుపవలయు. భోగసంకల్పవర్జితంబున
సంసాకవిషవృక్షాంకురంబు ద్రుంపవలఁయు; మఱియును.

241


క.

చిత్తవ్యాధుల కౌషధ
ముత్తమమును ఋజువు నయిన యొక్కటి విను మ
త్యుత్తమ మభిమతసుఖముల
పొ త్తెడలి నిరామయత్వమున సుఖి వగుమీ.

242


క.

ఏ యభిలాషలఁ బొందక
కాయము నిజ మనక బాహ్యగతు లెడలి మదిన్
స్వాయత్తజ్ఞానంబున
బాయక చిత్తంబు గెలువు భానుకులేశా.

243


గీ.

శాస్త్రశిక్షల నిశిత మై చల్ల నైన