పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

79


గట్టువడినట్లు విశ్వంబు గట్టువడియె;
నకట మాయాప్రభావ మే మందు ననఘ!

248


వ.

అని మఱియు నిట్లనియె.

249


అక్కట లవణనృపాలుఁడు
తక్కక తనకొలువులోనఁ దనతను వుండన్
ది క్కెడలి మాలవాటుల
నక్కానలఁ బొంది యేమి యయ్యె మునీంద్రా.

250


క.

అనిన వసిష్ఠుం డి ట్లను;
విను రాఘవ లవణనృపతివృత్తాంతం; బా
యన రాజసూయయాగము
మును సేసినకతన దుఃఖములు కుడిచె వడిన్.

251


వ.

అది యె ట్లనిన రాజసూయయాగకర్తలు ద్వాదశవర్షదుఃఖంబు
లనుభవించుట జగద్విదితంబు గావున, నతని క్రతువునకు శతక్రతుం డ
సూయాయత్తుం డయి యొక్కదూతం బనిచిన వాడు శాంబరికరూ
పంబునఁ జనుదెంచి యారాజు నత్యంతమోహాంధుం గావించి చని
యె. నది కారణంబుగా నతండు ముహూర్తద్వయంబునఁ బండ్రెండేం
డ్లదుఃఖంబు లనుభవించె. నట్టి దురవస్థలం బడి లవణుండు కొలువు
వారలకుఁ జెప్పి వీడ్కొని నిజమందిరంబున కరిగి తనమనంబున ని
ట్లని వితర్కించె.

252


ఉ.

అక్కట రాజసూయమఖ మాగలిఁ జేసినయట్టినాకు నేఁ
డెక్కడి పాటు వచ్చె! నిది యేగతిఁ బాటిలె నొక్కొ దైవమా!
యెక్కడఁ జొచ్చువాఁడ నని యెంతయు బెగ్గిల నవ్వనంబు దాఁ
దక్కక తోఁచె నాతనిమనంబున దర్పణబింబభాతి యై.

253


వ.

ఇ ట్లత్యంతదుఃఖంబు నొందినయవ్వనం బంతయుం దనచిత్తంబునం
దోఁచిన నాభూపాలుండు మఱునాఁడు సచివసమేతుం డై బలంబులం