పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

వాసిష్ఠరామాయణము


మాని యొ త్తిలి నవ్వుచుఁ దాన తనదు
బాహులను మేను ఖండించి పాఱవైచి.

194


ఉ.

ఊరక యున్నఁ జూచి వెఱఁ గొందుచు నే నటు వోవ నొక్కచో
దారుణకాయుఁ డొక్కరుఁ డుదగ్రత నాతనియట్ల యంగమున్
ఘోరముగాఁగ మోఁదుకొనఁ గొంకక పట్టిన వాఁడు నన్ను ధి
క్కారము చేసి దుర్ద్విజుఁడ కాఱులు సెప్పకు మంచు నుధ్ధతిన్.

195


వ.

ఒక్కమహాంధకూపంబునం దురికె. నతండె కాఁ డట్టిపురుషుల ననే
కులం బొడగంటి నని సెప్పి; యీయాఖ్యానతాత్పర్యంబు నీ కెఱిం
గించెద విను మని యి ట్లనియె.

196


సీ.

అయ్యరణ్యంబు దా నది మహాసంసార,
        మాఋషుల్ మాన సాఖ్యంబు, లతని
కరములు పరిఘలు పరఁగ ధీవృత్తులు,
        ప్రహరణంబులు దుఃఖపాపవితతు,
లంధకూపము నిరయం, బరఁటులతోట
        స్వర్గంబు, బహుకరంజములు మత్యున్,
లెసఁగుశాస్త్రవివేక మేను వివేకింప
        భోగశైథిల్య మై పొడముచిత్త


గీ.

తాప మాతండు సేయురోదనము, హాస్య
మాత్మసంతోష, మంగకత్యాగ మనఁగ
వృత్తినాశంబు, వాడు దుర్వృత్తి నన్ను
ధిక్కరించుట నాస్తికస్థితి యెఱుంగు.

197


వ.

అని పితామహుఁడు తనకుఁ దొల్లి సెప్పినకథాక్రమం బెఱింగించి
వసిష్ఠుండు మఱియు ని ట్లనియె.

198


గీ.

గోరి యాత్మవివేకంబు కొంత గలిగి
యమలనిర్వాణపదమును నంద లేక