పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

71


భోగముల మాని తద్గతిఁ బొందఁ దివురు
నదియ పరితాప మనఁబడు నవనినాథ.

199


క.

జ్ఞానవివేకప్రాప్తుం
డై నిఖిలము విడిచి తన్మయత్వంబునఁ ద
స్మానసలయ మొనరించుట
యానందు బనఁగ నొప్పు నవనీనాథా.

200


క.

చిత్తమ ప్రకృతియుఁ బురుషుఁడుఁ
జిత్తమ సంసార మగుట చింతించి తగన్
జిత్తత్యాగము సిసి న
రోత్తమ యానందపదము నొందుము నెమ్మిన్.

201


వ.

అని చిత్తోపాఖ్యానంబు రామచంద్రున కెఱింగించి వసిష్ఠుండు మఱి
యు ని ట్లనియె.

202


గీ.

సర్వశక్తిమయము శాశ్వత మాపూర్ణ
మవ్యయంబు బ్రహ్మ మనఁగ బరఁగి
సర్వదేవులందు శక్తిస్వరూపమై
మనము వెలుఁగుచుండు జనవరేణ్య.

203


వ.

ఎ ట్లనిన నది యాత్మకు నుల్లాసశక్తియు బ్రహ్మంబునకుఁ జిచ్ఛక్తి
యు వాయువునకు స్పందశక్తియు శిలలయందు దార్ఢ్యశక్తియు నుద
కంబునకు ద్రవశక్తియు ననలంబునకు దాహశక్తియు నాకాశంబునకు
శూన్యశక్తియు వినాశంబునకు లయశక్తియు నయి ప్రవర్తిల్లు. చిత్ర
వర్ణపింఛశిఖండమండితం బగు మయూరంబు తదండాంతర్గతజ
లం బై యున్న యట్లు మూలవిటపశాఖాపత్రపుష్పఫలసమేతం బగు
వృక్షంబు బీజంబునం దున్న యట్లు స్థూలసూక్ష్మరూపంబున విహరించు
చుండు; మఱియును.

204


గీ.

దేశకాలాదివైచిత్రిఁ జేసి ధరణి