పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

67


పుణ్యకథలయందుఁ బొందుట సెప్పడి
నింకఁ జిత్తశంక లేల నాకు.

175


వ.

అని నిశ్చయించి.

176


ఉ.

ఆ తరలాక్షి యొక్కతెయ యానడురాతిరి పెక్కుమోసలల్
వే తఱియంగ దూరి యట వీధికి వెల్వడి సందిక్రంతగా
నాతని యిల్లు సొచ్చి ప్రియ మారఁగ వాఁడును దాను సంతత
ప్రీతి రమించుచుండె విపరీతగతిన్ భయ మేది యెంతయున్.

177


వ.

అంత నొక్కనాఁడు.

178


క.

ఆ పట్టణపుఁ దలవరు
లేపారఁగఁ బట్టి వారి నిరువురఁ గొని యా
భూపాలుమ్రోలఁ బెట్టిన
గోపంబున నృపతి వారిఁ గొట్టించె వెసన్.

179


వ.

మఱియు ననేకవిధంబుల బాధింప వారల శరీరంబుల జర్జరితంబు
లయి రక్తధార లొలుకుచుండ మిసిమింతులు గాక కలకల నవ్వుచు
నానృపాలున కి ట్లనిరి.

180


ఉ.

ఈసునఁ జేయు కార్యముల నే మగు? నిద్దఱ నావలంతగా
గోసిన నైన నొప్పియును గోపముఁ బుట్టదు దేహవాసనన్
బాసి మనోగతుల్ సురతభావనఁ గూడి రమించుచుండ నీ
చేసినచేఁత లెవ్వియును జిత్తము నొంపఁగలేవు భూవరా.

181


క.

ఇత్తరలాక్షికి నాకును
జిత్తము లేకముగఁ గలసి చిత్తజసౌఖ్యా
యత్తత నవ్వల నుండఁగ
నిత్తనువులబాధ మాకు నెఱుఁగఁగ నగునే?

182


వ.

అది యెట్లనిన.

183


ఉ.

చిత్తమ కారణం బఖిలసృష్టికి, మ్రాఁకుల దీఁగెలన్ జలం