పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

వాసిష్ఠరామాయణము


టూహింప నతథ్య మైన, నొక్కటి వినుఁడీ;
దేహము సుఖదుఃఖంబులు
దేహికి ప్రాపింప కున్నె దివ్యమునీంద్రా!

168

కృత్రిమేంద్రోపాఖ్యానము

వ.

అనిన వసిష్ఠమునీంద్రుం డీ యర్థంబున నొక్కయితిహాసంబు గల
దాకర్ణింపు మని యి ట్లనియె.

169


క.

ఇంద్రద్యుమ్నుం డనురా
జేంద్రుడు గలఁ డతనిసతి మదేభగమన స
న్మంద్రమృదువచన రాకా
చంద్రానన మదనమోహశర మన వెలయన్.

170


ఉ.

ఆ సుదతీలలామ దనహర్మ్యతలంబున నిల్చి మానసో
ల్లాసము సేయుపట్టణవిలాసము సూచుచు నుండ, నయ్యెడన్
భూసురవర్యుఁ డొక్కవిటపుంగవుఁ 'డింద్రుఁడు' నాఁగ నొక్కఁ డా
సాసల వేశ్యవాటికలయందు రమించుచు నుండు నాతనిన్.

171


క.

కని వానిపట్టుఁ బేరును
దన బోటుల చేతఁ దెలిసి తరలేక్షణ నె
మ్మనమునఁ గోరిక తీఁగెలు
గొనసాఁగఁగ వానిఁ బొందఁ గోరుచునుండెన్.

172


వ.

అంతట నొక్కనాఁడు.

173


ఉ.

ఆరమణీశుమ్రోల నితిహాసకుఁ డొ'క్కఁడు గోష్ఠి సేయుచున్
వారక యింద్రుఁ డొక్కమునివల్లభుభార్య నహల్యఁ దెంపునన్
జారత కోర్చి పొందిన ప్రసంగము చెప్పఁగ నామృగాక్షియున్
జేరువ వించునుండి దనచిత్తమునన్ దలపోసి యిట్లనున్.

174


గీ.

ఆతఁ డింద్రు డే నహల్య నిద్దఱకును
బొందు గూర్చె మున్ను పుష్పశరుఁడు