పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

65


చింతలనెడఁబాసి యంతరంగంబులఁ
        బరమాత్మతత్త్వంబు పదిలపఱిచి
యఖిలలోకంబుల నమరులఁ గల్పించు
        బ్రహ్మల మే మనుభావనలను


గీ.

దపము సేయంగఁ దొల్లింటితనువు లెల్ల
శీతవర్షాతపంబులఁ జివికి యెండి
జీర్ణపర్ణంబులట్ల విశీర్ణ మైన
దివ్యదేహంబు లొంది భూదేవకులులు.

161


చ.

పదురు కుమారులుం బదురు బ్రహ్మలరూపులు దాల్చి యెల్లెడన్
విదితము గాఁగ సృష్టులను వేఱె యొనర్చి సుఖించుచుండఁగా
మొదలిటి బ్రహ్మ వారిఁ గని ముక్కున వ్రే లిడి యాత్మ నద్భుతం
బొదువ శిరంబు లూఁచి వెఱపొందె రఘూత్తమ యేమి సెప్పుదున్.

162


వ.

అని మఱియు నిట్లనియె.

163


క.

చిత్తంబ కర్త సృష్టికి
చిత్తమ జీవుండు గాక జీవుఁడు వేఱే?
చిత్తంబ చేయును గ్రియల్
చిత్తవ్యతిరిక్త మైన చేతలు గలవే.

164


వ.

అది యె ట్లనిన, బ్రాహ్మణమాతృకు లగునైందవు లందఱు మనోభావన
బ్రహ్మరూపంబు దాల్చి సృష్టికర్త లయి వెలింగి రట్లు గావున.

165


గీ.

దేహవాసన సేసినదేహి దాన
దేహబాధల సుడిపడి తిరుగుచుండు;
నాత్మవాసన సేసినయట్టియోగి
దేహ మిది మేలు కీ డని తెలియ నేచున్.

166


క.

అనిన విని రఘుపుంగవుండు మునిపుంగవున కిట్లనియె.

167


క.

దేహము జీవుఁడు వే ఱగు