పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

వాసిష్ఠరామాయణము


యనిన ననుజన్ము లందఱు నన్న కనిరి.

153


వ.

అ ట్లేని మాకు నఖిలరాజలోకశాసనుం డగురాజు సామ్రాజ్యపదంబు
గృపసేయు మనిన, నదియు నశ్వరం బేటికి? ననిన, వా రింద్రత్వం బడు
గుటయు నతండు.

154


గీ

తగఁ బ్రజాపతికిని ముహూర్తంబు సనిన
నింద్రసంపద చెడిపోవు, నేల మీకు?
ననిన వారలు మాకుఁ గల్పాంతములను
జేటు లేనట్టిగతి గృపసేయు మనిన.

155


వ.

వారికి నగ్రజుం డి ట్లనియె.

156


క.

 ఆకల్పాంతమునందును
బ్రాకటముగఁ జేటు లేని బ్రహ్మపదంబున్
మీ కిచ్చెద నని పలికన
నాకొమరులు నన్నఁ జూచి యని రుత్సుకులై.

157


వ.

తండ్రీ మీవాక్యంబు లత్యంతయుక్తంబు లయి యున్నయవి; యప్ప
దం బెవ్విధిం బ్రాపించుఁ జెప్పవే యనిన నగ్రజుం డి ట్లనియె.

158


గీ.

అభిలజగములు సృజియించునట్టి బ్రహ్మ
యేను యనుబుద్ధి వెలిచింత లెల్ల మఱచి,
నియతిఁ బద్మాసనస్థు లై నిలిచి చూచి,
తత్పదంబును బొందుఁడు తమ్ములార.

159


వ.

అనిన వార లగ్రజువాక్యంబు లంగీకరించి యతండునుం దారును న
త్యంతనియతాత్ము లయి యొక్క పుణ్యనదీతీరంబునందు.

160


సీ.

పద్మాసనస్థు లై బాహ్యకర్మంబులు
        మఱచి దేహంబుల మమత లుడిగి
సకలేంద్రియంబుల సమత మై జంధించి
        చిత్తంబు లొక్కటఁ జేసి నిలిపి