పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

63


జన నిశ్చయం బగుట ముం జిత్తం బను బాలుండు ప్రపంచపిశాచం
బుఁ గనుంగొని భయపడి ప్రబోధితుం డై పరస్పరరూపం బని యెఱిం
గిన చందంబునం దేటపడ నెఱింగించెద, నాకర్ణింపు మని వసిష్ఠుం
డు రామచంద్రున కి ట్లనియె.

149


క.

ఇంద్రుఁడు నాఁ నొకవిప్రుఁడు
సుందరియును దాను నాత్మశుద్ధిసమాధిం
జెంది రజతాద్రితటమున
నిందుధరుం గూర్చి తప మహీనతఁ జేసెన్.

150


గీ

అట్లు తపము సేసి యద్దేవువరమునఁ
బుత్త్రదశకలబ్ధి బొంది, కొంత
కాలమునకు వారు కాలగోచరు లైన,
నక్కుమారు లెందు దిక్కు లేక.

151


వ.

చింతాక్రాంతు లై యొండొరులం గూడుకొని యందఱు నగ్రజుకడ
కుం జని యి ట్లనిరి.

152


ఏమి సేయుద మింక? నేది కార్యము మన?
        కెవ్వరు గల రిందు? నెందుఁ బోద?
మీదుఃఖములఁ బాసి యెబ్భంగి సుఖియింత?
        మని తన్ను నడిగిన; నతఁడు మీకు
నెట్టిది మది కించు నట్టిది వర మిత్తు
        నడుగుడు మీ రన్న; నాత్మఁ బొంగి
యచ్చట నొకయూరియధికారిఁ బొడగని
        యాతనిసంపద యడుగ; నదియు


గీ.

నెంతపని యన్న; వారు సామంతపదవి
యడుగ; నది యేల యన్న; వా రవని నేలు
రాజసంపద వేఁడ; నారాజ్య మెంత