పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

వాసిష్ఠరామాయణము


నాకూన వత్స కర్కటి
చేకొని యాహారచింత చేయుము నెమ్మిన్.

120


వ.

మూఢులను దురారంభులను దుర్వ్యసనులను దుర్దేశవాసులను
వెకి భక్షింపుము. అనుచు నిర్దేశించి చనుటయు బాహ్యకర్మంబులు
మఱచి నిర్వికల్పసమాధి ననేకదివ్యవర్షంబు లుండె. బెద్దకాలంబు
నకుఁ చిత్తచలనం బగుటయు పూర్వస్మరణంబున బుభుక్షాతృష్ణలు
వేల్పం దొణంగిన నొక్కనాఁడు.

121


ఉ.

అచ్చపలాత్మ నొంటిగతి నాఁకటి కోర్వఁగలేక నొంటిమై
వచ్చునెడన్, విదేహజనవల్లభుఁ డన్నడురేయి మంత్రితో
నిచ్చలు వేఁట వచ్చి చరియింపఁగ, నవ్వనభూమిఁ గర్కశం
బచ్చుపడంగ వారిఁ గని యార్చుచు నిట్లని పల్క్ నుగ్రతన్.

122


క.

ఈశర్వరి నిద్దఱును దు
రాశలఁ జనుదెంచి నాకు నగపడితిరి; య
క్లేశత మీరక్తము లా
పోశనముగఁ బీఁచమణఁచి పుచ్చెద మిమ్మున్.

123


వ.

కా దేని నాయడిగిన ప్రశ్నంబుల కుత్తరంబులు సెప్పి ప్రాణంబులు
గాచికొం డని పల్కి, మఱియు ని ట్లనియె.

124


సీ.

ఏకమై యుండి యనేకసంఖ్యలు గల
        యణువులోఁ జెంది బ్రహ్మాండలక్ష
లంబుధిలో బుద్బుదారములభాతి
        నుండఁగ నవకాశ మొదవునట్టి
యాకాశ మెద్ది? దా నరయ నేమియు లేక
        యించుక గలవస్తు వెద్ది గలదు?
నడుచుచునుండియు నడువనివాఁ డెవ్వఁ?
        డుండక నుండియు నుండు నెవ్వఁ?