పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

59


గీ.

డెనయఁ జేతన మంది దా నెవ్వఁ డయ్యె?
నరయ నెవ్వఁడు మింటఁ జిత్తరువు వ్రాసె
బీజముననుండి వృక్షంబు బెరసినట్లు
జగము నే యణువందు నిశ్చలత నుండు?

125


గీ.

కడలి కడ లొందుగతిఁ పృథగ్భాగ మయ్యు
నేక మగువస్తు వరయఁ దా నెద్ది యయ్యె?
ద్రవము నుదకంబు నొక్క టై తనరుభంగి
రెండుబలెఁ దోఁచి యొక్క టై యుండు నెద్ది?

126


వ.

అని చెప్పి మఱియు నారాక్షసి యి ట్లనియె.

127


క.

బంధురగతి నీ ప్రశ్నలు
సంధానము సేసి సెప్పఁజాలని యా ద
ర్పాంధులఁ నా జఠరాగ్నికి
నింధనములఁ జేసి పుత్తు నిరువుర మిమ్మున్.

128


వ.

అనిన విని వార లిరువురు నొండొరువులమొగంబు సూచికొని యవ్వి
భుం డాత్మవిద్యాసంవేది గావున భయపడక మంత్రి కి ట్లనియె.

129


క.

కర్కటి యనియెడి రాక్షసి
మర్కటి, యిది యడుగు నట్టిమాటలు మిగులం
గర్కశము లనక సంవి
త్తర్కములకు నుత్తరములు తగఁ జెప్పు మనన్.

130


వ.

అనిన విని మంత్రి యి ట్లనియె.

131


గీ.

కణఁగి వడ్లును పెరుగును గలుపుభంగి
నకటవికటంబు లగు ప్రశ్న లడిగె నదియు;
మూవలము వోలె దీనిచే జావ నేల
యీడుజోడుగఁ జెప్పెద నెఱిఁగినంత.

132


వ.

అని పలికి యా రాక్షసిం గనుంగొని మంత్రి యిట్లనియె.

133