పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

57


వ.

అనిన వసిష్ఠుం డి ట్లనియె.

115


ఉ.

కాటుకగుబ్బలి న్మలిచి కాలుఁ డొనర్చినకృత్తియో యనన్
బాటిగ నట్టహాసములఁ బాదవిఘట్టనలన్ మహాశుభృ
త్కూటము లెల్ల డొల్లఁగ నకుంఠితవృత్తి హిమాచలాంతరో
గ్రాటవులన్ జరించుచు నిశాటిని కర్కటి యుండు నిమ్ములన్.

116


సీ.

అమ్మహారాక్షసి యాఁకటి కోర్వక
        నవని జీవులఁ జంప నాత్మఁ గోరి,
యతిఘోరతపమున నబ్జజు మెప్పించి
        శూలయుఁ బోలె విషూచి యనఁగ
ధరలోనఁ గలజీవతతి నెల్లఁ బెక్కేండ్లు
        దయ లేక భక్షించి తనివి నొంది,
నిష్ఠ మై నింద్రియనిగ్రహంబున నిరా
        హారయు నై యతిఘోరభంగి


గీ.

జీవహింసయు మది రోసి చిత్స్వరూప
మాత్మ భావించి నిత్యసమాధి నిలిచి
తన్మయం బైనచిత్తంబు దరల నీక
ప్రీతి వేయేండ్లు తప మాచరించి మఱియు.

117


వ.

ఇ ట్లత్యంతనిష్ఠురానుష్ఠానంబు లనుష్టించుచున్న కర్కటి కడకుఁ
గమలగర్భుండు చనుదెంచి యి ట్లనియె.

118


క.

నీతపమున కే
మెచ్చితి,
చేతోవిశ్రాంతి గంటి, జీవన్ముక్తి
ఖ్యాతిఁ గయికొంటి, విలలో
నే తపములు నీతపమున కెనయే తరుణీ!

119


క.

ఈ కూ డుడిగినతపములు
నీ కేటికి సర్వశాంతి నెమ్మది నిగుడన్