పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

వాసిష్ఠరామాయణము


గీ.

అట్లు సొత్తెంచి యప్పురియంతరముల
జీవుఁ డిల్లిల్లు వెసఁ జొచ్చి పోవఁబోవ
వెలఁది జోడును విడువక వెంట నరిగె
సూదిపిఱుఁదన చనుదెంచుసూత్ర మట్ల.

97


వ.

ఇవ్విధంబునఁ జనిచని యత్యంతరమణీయం బగు రాజమందిరంబు ప్రవే
శించి.

98


ఉ.

మాడుగుక్రేవ సోమమణిమంటపముం గని దానితిన్నెపై
వాడనిపుప్వుఁజప్పర మవారణ మై వెసఁ జొచ్చి యచ్చటన్
బాడఱి పాన్పుపైఁ బడినపద్మునిదేహముఁ బొందె జీవుఁ డా
చేడెలు చూడ మేఘమును జెందినతీఁగెమెఱుంగుచాడ్పునన్.

99


క.

ప్రాణమునఁ గూడుకొని త
త్ఘ్రాణద్వారమున జీవకళ వికసించెన్
వేణుద్వారమున జగ
త్ప్రాణుఁడు విహరించునట్లు భానుకులేశా.

100


వ.

ఇట్లు జీవకళ ప్రవేశించిన సర్వాంగంబులు కాంతియుతంబులు రసవం
తంబులు మృదులంబులు నయి యొప్పె నప్పుడు.

101


ఉ.

మోము వికాస మందఁ, గరముల్ గదలించుచుఁ, గాళ్లు సాచి, యి
ట్లా మెయి ప్రక్కగాఁ దిరిగి, యల్లన నీల్గుచు నావులించెఁ, గెం
దామరరేకులట్ల జిగిదారెడుకన్నులు విచ్చి సూచి యా
భూమివిభుండు మేల్కనియెఁ బొల్పగుజంగమవిద్యయో యనన్.

102


వ.

ఇట్లు మేల్కని గంభీరవాక్యంబుల నిది యెక్కడ నని పల్కు నాభూ
పాలుం గనుంగొని.

103


క.

కిలకిల నవ్వుచుఁ గన్నులు
తళతళ వెలుఁ గొంద మోముఁదామరసొబఁ గై
పలపలనినడుము దనరఁగ